యాప్నగరం

నన్ను డబ్బుతో కొనే మగాడు పుట్టలేదు.. మమతకు అసదుద్దీన్ ఒవైసీ స్ట్రాంగ్ కౌంటర్

వచ్చే ఏడాది మేలో పశ్చిమ్ బెంగాల్ శాసనసభ ఎన్నికలు జరగనుండగా.. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 18 స్థానాల్లో విజయం సాధించడంతో రెట్టించిన ఉత్సాహంతో ఉంది.

Samayam Telugu 16 Dec 2020, 2:03 pm
కోట్లాది రూపాయలతో హైదరాబాద్ నుంచి ఓ పార్టీ తీసుకొచ్చి ముస్లిం ఓటర్లలో చీలిక తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా తమ పార్టీపై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ‘డబ్బుతో అసదుద్దీన్ ఒవైసీని కొనే మగాడు ఇంకా పుట్టలేదు’ అంటూ దీదీకి కౌంటర్ ఇచ్చారు. ముస్లిం ఓటర్లు మమతా జాగీర్ లేదా సొంతం కాదని వాగ్బాణాలు సంధించారు.
Samayam Telugu అసదుద్దీన్ ఒవైసీ


Read Also:
నేటితో నిర్భయ ఘటనకు ఎనిమిదేళ్లు.. తల్లి ఆశాదేవి సంచలన ప్రతిజ్ఞ

‘అసదుద్దీన్ ఒవైసీని డబ్బుతో కొనగలే వ్యక్తి ఇంకా పుట్టలేదు.. ఆమె ఆరోపణలు నిరాధారమైనవి.. ఆమె బాగా అలసిపోయారు.. తృణమూల్ పార్టీకి చెందిన చాలా మంది నేతలు బీజేపీలోకి వెళుతున్నారు.. కాబట్టి తన పార్టీ గురించి ఆమె ఆందోళన చెందాలి.. మాకు ఓటువేసిన బీహార్ ఓటర్లు, ప్రజలను మమత అవమానించారు’ అంటూ ఒవైసీ మండిపడ్డారు. బిహార్ శాసనసభ ఎన్నికల్లో పోటీచేసిన ఎంఐఎం గణనీయంగా ఓట్లను సాధించి, ఐదు స్థానాల్లో విజయకేతం ఎగురువేసిన విషయం తెలిసిందే.

Read Also: ఏసీబీకి చిక్కిన అవినీత చేప.. పొల్యూషన్ బోర్డ్ అధికారి ఇంట్లో వందల కోట్ల ఆస్తులు!

వచ్చే ఏడాది పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా... అక్కడ కూడా తాము పోటీచేస్తామని ఒవైసీ ప్రకటించారు. ఎంఐఎం పోటీచేయడం వల్ల ముస్లిం ఓటు బ్యాంకు చీలిపోయి బిహార్‌లో ఎన్‌డీఏ కూటమికి లబ్ది చేకూరింది. పశ్చిమ్ బెంగాల్‌లోనూ పోటీచేస్తే అదే ఫలితం పునరావృతం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ కొంత ఆందోళన చెందుతున్నారు.

Read Also: టీకాతో దుష్ప్రభావాలు కొట్టిపారేయలేం.. అత్యవసర చికిత్సకు ఏర్పాట్లు చేయండి

‘ముస్లిం ఓట్లను చీల్చడానికి హైదరాబాద్ నుంచి ఒక పార్టీని తీసుకొచ్చేందుకు బీజేపీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.. బీజేపీ హిందూ ఓట్లను..ఈ హైదరాబాద్ పార్టీ ముస్లిం ఓట్లను పొందడానికి ప్లాన్ వేశారు.. ఇటీవలి బీహార్ ఎన్నికల్లో వారు అదే పని చేశారు. ఈ పార్టీ బీజేపీకి చెందిన బి-టీం’ అంటూ మంగళవారం జలపాయ్‌గురిలో జరిగిన ఓ ర్యాలీలో మమతా బెనర్జీ అన్నారు.

Read Also: ప్రణబ్ కుటుంబంలో చిచ్చురేపిన ‘ఆత్మకథ’..అన్నాచెల్లెళ్ల మధ్య వార్!

‘ఇప్పటివరకు మీకు విధేయులైన మీర్ జాఫర్లు, సాదిక్‌లను మాత్రమే అక్కునచేర్చుకుంటారు.. తమ గురించి ఆలోచించి, మాట్లాడే ముస్లింలను మీరు ఇష్టపడరు.. మీరు బీహార్‌లోని మా ఓటర్లను అవమానించారు. ఓట్ల చీలికపై వైఫల్యాల విషయంలో బీహార్‌లోని పార్టీలకు ఏమి జరిగిందో గుర్తుంచుకోండి.. ముస్లిం ఓటర్లు మీ జాగీర్ కాదు’ అంటూ అసదుద్దీన్ ఒవైసీ మమతకు కౌంటర్ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.