క్రిమినల్ కేసులు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వాధికారులకు పాస్పోర్ట్ జారీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు ఇక నుంచి పాస్పోర్టు మంజూరు చేయబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఇలాంటి అధికారులు వైద్యం లాంటి అత్యవసర పరిస్థితుల్లో పాస్పోర్టు తీసుకోవాలంటే విజిలెన్స్ క్లియరెన్స్ తప్పనిసరి చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం, దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేయడం, ఛార్జిషీటులో అధికారి పేరు ఉండటం, ఎఫ్ఐఆర్ నమోదు కావడం, అవినీతి కేసులో న్యాయస్థానాల విచారణ, విధుల నుంచి తప్పించడం లాంటి పరిస్థితుల్లో సివిల్ సర్వీస్ అధికారులకు తాజా నిబంధనల ప్రకారం పాస్పోర్టు ఇవ్వడం కుదరదు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను అవసరమైతే పాస్పోర్టు అధికారులు పరిశీలించి, మంజూరు చేసే అంశంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం వారికి ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. అవినీతి కేసులు నమోదైన అధికారులకు చెందిన కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉండి, వారికి వైద్య పరంగా ఏమైనా అత్యవసర పరిస్థితి వస్తే, అలాంటి సందర్భాల్లో విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తామని పేర్కొంది. ఈ ఉత్తర్వులను అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కార్యదర్శులకు పంపినట్టు హోంశాఖ తెలిపింది. అవినీతి అధికారులు కేసుల విచారణ నుంచి తప్పించుకోడానికి దేశం విడిచిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను అవసరమైతే పాస్పోర్టు అధికారులు పరిశీలించి, మంజూరు చేసే అంశంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం వారికి ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. అవినీతి కేసులు నమోదైన అధికారులకు చెందిన కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉండి, వారికి వైద్య పరంగా ఏమైనా అత్యవసర పరిస్థితి వస్తే, అలాంటి సందర్భాల్లో విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తామని పేర్కొంది. ఈ ఉత్తర్వులను అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కార్యదర్శులకు పంపినట్టు హోంశాఖ తెలిపింది. అవినీతి అధికారులు కేసుల విచారణ నుంచి తప్పించుకోడానికి దేశం విడిచిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.