యాప్నగరం

కొత్త రూ.వెయ్యి నోట్ల ముద్రణ లేదు: శక్తికాంత

రద్దయిన రూ.వెయ్యి నోట్ల స్థానంలో మళ్లీ కొత్తగా రూ.1000నోట్ల ముద్రణ ఉంటుందని జరుగుతున్న ప్రచారాన్ని

Samayam Telugu 22 Feb 2017, 11:52 am
రద్దయిన రూ.వెయ్యి నోట్ల స్థానంలో మళ్లీ కొత్తగా రూ.1000నోట్ల ముద్రణ ఉంటుందని జరుగుతున్న ప్రచారాన్ని ఆర్ధికవ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ కొట్టిపారేశారు.
Samayam Telugu no plans of new 1000 notes shaktikanta das
కొత్త రూ.వెయ్యి నోట్ల ముద్రణ లేదు: శక్తికాంత


‘‘రూ.వెయ్యి నోట్లను ముద్రించే ప్రణాళికేం లేదు. రూ.500నోట్లతో పాటు అంతకంటే తక్కువ నగదు విలువున్న నోట్లను ముద్రించడంపైనే ఇప్పుడు దృష్టి సారించాం’’ అని ఆయన ట్వీట్ చేశారు.

No plans to introduce ₹1000 notes. Focus is on production and supply of ₹500 and lower denomination notes.— Shaktikanta Das (@DasShaktikanta) February 22, 2017
గతేడాది నవంబర్ 8 న అర్థరాత్రి పాత పెద్ద నోట్లు రూ.500, రూ.1000 చెలామణీలో లేకుండా పోయాయి. ఆ సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా రూ.2వేల నోట్లను ముద్రిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనికితోడు ఇప్పుడున్న రూ.2వేల నోట్ల నమూనాలు సైతం సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.

ప్రస్తుతం రూ.1000 కొత్త నోటు ఇదేనంటూ ఒక వయోలెట్ కలర్ లో ఉన్న ఓ నమూనా నోటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆర్బీఐ, ప్రభుత్వం రూ.వెయ్యినోట్లను ఈ యేడాది జనవరిలోనే ప్రవేశపెట్టాల్సి ఉందని కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడిందని, త్వరలో రూ.వెయ్యి నోట్ల విడుదల చేస్తుందని మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో కేంద్రప్రభుత్వం తరఫున శక్తికాంతదాస్ ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.