యాప్నగరం

అక్కడా బీజేపీకి ముస్లిం ప్రతినిధులు లేరు

మొన్న జరిగిన ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టిక్కెట్ కేటాయించలేదు.

Samayam Telugu 26 Apr 2017, 7:01 pm
మొన్న జరిగిన ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టిక్కెట్ కేటాయించలేదు. దీంతో ఆ పార్టీపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. వివిధ పార్టీల్లో ఉండే నేతలు, పలు ముస్లిం సంఘాలు బీజేపీ మతతత్వ పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు.
Samayam Telugu no room for muslims in bjp of mcd as they defeated
అక్కడా బీజేపీకి ముస్లిం ప్రతినిధులు లేరు


దీంతో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఐదుగురు ముస్లిం అభ్యర్థులను పోటీ చేయించింది. ఢిల్లీలోని మూడు మున్సిపల్ కార్పోరేషన్లలో బీజేపీ విజయం సాధించినా.. ముస్లిం అభ్యర్థులు మాత్రం ఓడిపోయారు. బీజేపీ తరఫున ముస్లింలు పోటీచేసిన చోట కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.

ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్లలో బీజేపీ అధికారం చేపడుతున్నప్పటికీ ముస్లింల ప్రాతినిథ్యం లేకుండా పోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.