యాప్నగరం

అవిశ్వాసంపై చర్చ: బీజేడీ వాకౌట్.. మోదీ ముసి ముసి నవ్వులు!

కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ మొదలైంది.

Samayam Telugu 20 Jul 2018, 12:32 pm
కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ మొదలైంది. అయితే సభ ప్రారంభమైన వెంటనే బిజూ జనతా దళ్ (బీజేడీ) వాకౌట్ చేసింది. కటక్ బీజేడీ ఎంపీ భర్తృహరి మహ్తాబ్ మాట్లాడుతూ.. ‘గడిచిన 14 ఏళ్లుగా పదేళ్ల యూపీఏ, నాలుగేళ్ల ఎన్డీఏ పాలనలో ఒడిశాకు అన్యాయమే జరిగింది. ఇప్పుడు ఈ చర్చ వల్ల ఒడిశా ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. అందుకే మేం చర్చలో పాల్గొనడంలేదు. వాకౌట్ చేస్తున్నాం’ అని స్పీకర్‌కు వెల్లడించారు. అనంతరం ఆ పార్టీకి చెందిన 11 మంది ఎంపీలు లోక్‌సభ నుంచి బయటికి బయలుదేరారు.
Samayam Telugu Modi


ఇదే సమయంలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే సహా కాంగ్రెస్ ఎంపీలు.. చర్చలో భాగంగా ప్రతిపక్షాలకు అధిక సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలకు కేటాయించిన సమయంలో అన్ని అంశాలు ప్రస్తావించేందుకు వీలుకాదంటూ ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సభలో ఒకటే అరుపులు, గందరగోళం. ఖర్గేను కూర్చోవాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ పదే పదే కోరారు. ఈ పరిస్థితి చూసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముసి ముసి నవ్వులు నవ్వారు. ఆ తరవాత కాసేపటికి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.