యాప్నగరం

కైలాష్ సత్యార్థి ఇంట్లో చోరీ: నోబెల్ ప్రైజ్ రెప్లికా మాయం

సోషల్ యాక్టివిస్ట్ కైలాష్ సత్యార్ధి ఇంట్లో మంగళవారం తెల్లవారుజామన చోరీ జరిగింది. ప్రస్తుతం సత్యార్ధి...

TNN 7 Feb 2017, 11:36 am
సోషల్ యాక్టివిస్ట్ కైలాష్ సత్యార్ధి ఇంట్లో మంగళవారం తెల్లవారుజామన చోరీ జరిగింది. ప్రస్తుతం సత్యార్ధి అమెరికాలో వున్నారు. అయితే, సత్యార్ధి ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలు, ఇతర విలువైన వస్తు, సామాగ్రితోపాటే నోబెల్ ప్రైజ్ రెప్లికాని కూడా ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. నోబెల్ ప్రైజ్ రెప్లికా అంటే ఒరిజినల్‌ని పోలి వున్న మరొక ప్రైజ్. వాస్తవానికి ఒరిజినల్ నోబెల్ ప్రైజ్ ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతి భవన్‌లో వుంది.
Samayam Telugu nobel prize replica stolen from kailash satyarthis delhi house
కైలాష్ సత్యార్థి ఇంట్లో చోరీ: నోబెల్ ప్రైజ్ రెప్లికా మాయం


బహుశా ఒరిజినల్ అనే ఉద్దేశంతోనే దొంగలు ఈ నోబెల్ ప్రైజ్ రెప్లికాను ఎత్తుకెళ్లి వుండి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేవలం ఈ నోబెల్ ప్రైజ్‌ని తస్కరించాలనే దురుద్దేశంతోనే ఈ చోరీ జరిగిందా అనే కోణంలోనూ పోలీసులు ఆరాతీస్తున్నారు. ఐపీసీ సెక్షన్ 380 కింద చోరీ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

క్రైమ్, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించారు. స్థానిక నేరస్తులు, స్క్రాప్ దుకాణాల యజమానులని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నించి ఇంకొంత వివరాలు సేకరిస్తున్నారు. సౌత్ ఢిల్లీలోని పాష్ ఏరియాల్లో ఒకటైన అలకనంద ప్రాంతంలో నివాసం వుంటున్న సత్యార్థి ఇంట్లో చోరీ జరగడంతో అక్కడి స్థానికుల్లోనూ ఒక రకమైన భయం, ఆందోళన మొదలయ్యాయి. గత నవంబర్ 29న కూడా కాంగ్రెస్ నేత శశి థరూర్ ఇంట్లో జరిగిన చోరీలో కూడా విలువైన విగ్రహాలు, వస్తుసామాగ్రి మాయం అయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.