యాప్నగరం

ఈశాన్యం అభివృద్ధితోనే భారత్‌ వృద్ధి వేగవంతం: మోదీ

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధితోనే భారత వృద్ధి వేగవంతం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం (ఫిబ్రవరి 3) ఆయన అసోంలోని గువాహటిలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2018)ను ప్రారంభించారు.

TNN 3 Feb 2018, 11:58 pm
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధితోనే భారత వృద్ధి వేగవంతం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం (ఫిబ్రవరి 3) ఆయన అసోంలోని గువాహటిలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2018)ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ఈ సదస్సు ట్యాగ్‌లైన్‌ ఓ పెద్ద సందేశాన్నిస్తోంది. అడ్వాంటేజ్‌ అసోం: ఇండియా ఎక్స్‌ప్రెస్‌ వే టు ఆసియాన్‌.. ఇది ఒక ప్రకటన మాత్రమే కాదు. ఓ దృక్పథం. ఆసియాన్‌ దేశాలతో భారత్‌ సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయి’ అని అన్నారు.
Samayam Telugu northeast is at heart of act east policy says pm modi in assam
ఈశాన్యం అభివృద్ధితోనే భారత్‌ వృద్ధి వేగవంతం: మోదీ


తమ ప్రభుత్వం యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీని రూపొందించిందని.. ఈశాన్య రాష్ట్రాలే దీనికి బలమని మోదీ పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలు, ఇక్కడి ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే భారత వృద్ధి కూడా వేగవంతమవుతుందన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. ఈ సదస్సులో మోదీతో పాటు భూటాన్‌ ప్రధాని కూడా పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.