2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి, రైతులు ఆదాయం గురించి ప్రస్తావించిన అంశాలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెండింతలు సాధ్యంకాదని ఆయన అన్నారు. అప్పటికి వ్యవసాయరంగంలో వృద్ధి 12 శాతం మాత్రమే ఉంటుందని మన్మోహన్ పేర్కొన్నారు. అలాగే ద్రవ్యలోటు కూడా పెరుగుతుందని, ఎన్డీఏ సర్కారు తన హామీలను ఎలా నెరవేర్చుతుందని మన్మోహన్ ప్రశ్నించారు. కేవలం ఎన్నికల్లో లబ్ది పొందడానికే మోదీ సర్కారు ఇలాంటి బడ్జెట్ను తీసుకొచ్చిందని తాను ఆరోపించడం లేదు, కానీ దీనికి అవసరమైన ఆర్థిక ఆధారాలు ఆందోళన కలిగిస్తున్నాయని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్ సంస్కరణలకు అనుగుణంగా ఉంటుందా అని ప్రశ్నిస్తే... ఈ పదాన్ని చాలాసార్లు వినియోగించారు... దుర్వినియోగం చేశారని సింగ్ బదులిచ్చారు. వ్యవసాయ సంక్షోభం గతంలో కూడా ఉంది.. దీనిపై అనుసరించాలసి వ్యూహం ఏంటని అడిగితే...దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయాలనుకోవడంలేదని అన్నారు.
‘2022 నాటికి రైతులు ఆదాయం రెండింతలు అవుతుందని ప్రభుత్వం చెబుతోంది... కానీ అదిసాధ్యం కాదని, ఈ లక్ష్యాన్ని చేరుకుంటామనేది హామీ మాత్రమే’ అని కాంగ్రెస్ నేత గులామ్ నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రతిపక్ష పార్టీలతో సమావేశమైన అనంతరం ఆజాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రకటించిన బడ్జెట్పై విపక్షాలు పెదవివిరిచాయి. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి కేటాయింపులు అధికంగా ఉన్నా, దీనివల్ల ఒనగూరే ప్రయోజనం ఉండదని అంటున్నారు.
‘2022 నాటికి రైతులు ఆదాయం రెండింతలు అవుతుందని ప్రభుత్వం చెబుతోంది... కానీ అదిసాధ్యం కాదని, ఈ లక్ష్యాన్ని చేరుకుంటామనేది హామీ మాత్రమే’ అని కాంగ్రెస్ నేత గులామ్ నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రతిపక్ష పార్టీలతో సమావేశమైన అనంతరం ఆజాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రకటించిన బడ్జెట్పై విపక్షాలు పెదవివిరిచాయి. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి కేటాయింపులు అధికంగా ఉన్నా, దీనివల్ల ఒనగూరే ప్రయోజనం ఉండదని అంటున్నారు.