యాప్నగరం

Karnataka Cabinet మంత్రులు వీరే.. సిద్ధరామయ్య వర్గానికే పెద్దపీట!

Karnataka Cabinet: కర్ణాటకలో సీఎం ఎంపికపై ఫుల్ క్లారిటీ వచ్చింది. కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధరామయ్యకు జై కొట్టింది. దీంతో ఆయన ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కర్ణాటక కొత్త కేబినెట్‌పై చర్చ జరుగుతోంది. ఎవరికి మంత్రి పదవులు ఇస్తారు.. ఎవరి వర్గానికి ప్రాధాన్యత దక్కుతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అధికారికంగా కాకపోయినా.. కొందరి పేర్లు బయటకు వచ్చాయి. వారికే మంత్రి పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 18 May 2023, 6:21 pm

ప్రధానాంశాలు:

  • కర్ణాటకలో సీఎం ఎంపికపై ఫుల్ క్లారిటీ
  • సిద్ధరామయ్యకు జై కొట్టిన హస్తం హైకమాండ్
  • కర్ణాటక కొత్త కేబినెట్‌పై సర్వత్రా ఆసక్తి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Karnataka Cabinet
కర్ణాటక కేబినెట్
Karnataka Cabinet: కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి.. గురువారం కాంగ్రెస్ అధికారిక ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య (Siddaramaiah) , ఉప ముఖ్యమంత్రి పదవికి డీకే శివకుమార్ పేర్లను పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే.. కర్ణాటక కేబినెట్‌ లో చేరే అవకాశం ఉన్న ఎమ్మెల్యేల జాబితా కూడా బయటకు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
జి. పరమేశ్వర, ఎంబీ పాటిల్, కెజె జార్జ్, ప్రియాంక్ ఖర్గే, బిఆర్ రెడ్డి, రూపా శశిధర్, ఈశ్వర్ ఖండ్రే, జమీర్ అహ్మద్, తన్వీర్ సైత్, లక్ష్మణ్ సవాది, కృష్ణ బైరేగౌడ.. సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రులు కావచ్చనే టాక్ వినిపిస్తోంది. జి. పరమేశ్వర గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. సుదీర్ఘకాలం పాటు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండటమే కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వంలో అనేక మంత్రిత్వ శాఖలను కూడా నిర్వహించారు.
ఎంబీ పాటిల్‌ మాజీ ఎంపీ, సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. ఆయన లింగాయత్ వర్గానికి చెందిన నేత. కేజే జార్జ్ పార్టీ సీనియర్ నాయకుడు. ఆయన హెచ్‌డి కుమారస్వామి, సిద్ధరామయ్య ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. ఇక కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు.. ప్రియాంక్ ఖర్గే పేరు కూడా కొత్త మంత్రుల జాబితాలో ఉంది.

2016లో 38 ఏళ్ల వయసులో.. అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేబినెట్‌లో ఐటీ, బీటీ, పర్యాటక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అతి పిన్న వయస్కుడిగా.. ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge) నిలిచారు. హెచ్‌డి కుమారస్వామి నేతృత్వం లోని సంకీర్ణ ప్రభుత్వంలో.. సాంఘిక సంక్షేమ కేబినెట్ మంత్రి గా కూడా పనిచేశారు.

కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ కేహెచ్‌ మునియప్ప కుమార్తె.. రూప శశిధర్‌ పేరు కూడా మంత్రుల జాబితాలో ఉంది. ఇక ఈశ్వర్ ఖండ్రే గతంలో సిద్ధరామయ్య మంత్రివర్గంలో 2016 నుండి 2018 వరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ ఎంటర్‌ ప్రైజెస్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తన్వీర్ సైత్ 2016 నుంచి 2018 వరకు కర్ణాటక ప్రాథమిక, మాధ్యమిక విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు.

మాజీ మంత్రి కృష్ణ బైరే గౌడ పేరు కూడా మంత్రి పదవి రేసులో ఉంది. సిద్ధరామయ్య ప్రభుత్వంలోని కొత్త మంత్రుల జాబితాలో.. లక్ష్మణ్ సవాడి పేరు కూడా ఉంది. సవాడి గతంలో బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో.. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.