యాప్నగరం

రైల్వే ప్రయాణికులకు శుభవార్త!

రైల్వే ప్రయాణికులు టికెట్ల బుకింగుల కోసం డెబిట్, క్రెడిట్, ఇంటర్నెట్ బ్యాంకింగులను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.

TNN 1 Dec 2017, 10:32 am
రైల్వే ప్రయాణికులు టికెట్ల బుకింగుల కోసం డెబిట్, క్రెడిట్, ఇంటర్నెట్ బ్యాంకింగులను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు రైల్వే.. ఇకపై బీమ్ (BHIM), యూపీఐ (UPI) యాప్‌ల ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకునే సుదుపాయాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఈ మేరకు త్వరలో క్యూఆర్ కోడ్‌ ప్రవేశపెడతారు. అలాగే, యూపీఐ చెల్లింపుల కోసం దేశవ్యాప్తంగా 14 వేల కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే వెల్లడించింది.
Samayam Telugu now book rail tickets at reservation counters through upi
రైల్వే ప్రయాణికులకు శుభవార్త!


ఈ సందర్భంగా రైల్వే బోర్డు సభ్యుడు మొహమ్మద్ జంషెడ్ మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా రోజుకు సుమారు 7.5 లక్షల టికెట్లు బుక్ అవుతుండగా దాదాపు 97 శాతం బుకింగ్‌లు నగదు చెల్లింపుల ద్వారానే జరుగుతున్నాయని తెలిపారు. మూడు శాతం మాత్రమే డిజిటల్ రూపంలో జరుగుతున్నాయన్నారు. దేశంలోని అన్ని టికెట్ రిజర్వేషన్ కౌంటర్లలో శుక్రవారం నుంచి యూపీఐ చెల్లింపు వ్యవస్థ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు 14వేల కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.