యాప్నగరం

డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకున్నా కరోనా టెస్ట్.. అనుమానం వస్తే ఎవరైనా చేసుకోవచ్చు

ప్రిస్క్రిప్షన్ లేకున్నా కరోనా పరీక్ష చేసుకోవచ్చని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇకపై అనుమానం వస్తే ఎవరైనా పరీక్ష చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

Samayam Telugu 9 Sep 2020, 12:36 am
దేశ రాజధాని ఢిల్లీలో ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకున్నా కరోనా పరీక్షలు చేసుకోవచ్చు. వైరస్ సోకినట్లు అనుమానం వస్తే ఎవరైనా పరీక్షలు చేయించుకోవచ్చని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. వైద్య శాఖకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు సోమవారం (సెప్టెంబర్ 8) ఆయన ట్విటర్ ద్వారా తెలిపారు.
Samayam Telugu కరోనా పరీక్ష (ప్రతీకాత్మక చిత్రం)
Corona test in Delhi


కరోనా టెస్టింగ్‌కు వెళ్లే ముందు గుర్తింపు కోసం ప్రజలు తమ ఆధార్‌ కార్డును తీసుకెళ్లాలని ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే పేర్కొంది. దీంతో పాటు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌) ఇచ్చే ఫామ్స్ కూడా నింపాల్సిన అవసరం ఉంటుందని స్పష్టం చేసింది.

రాష్ట్రంలో కవిడ్‌ పరీక్షల సంఖ్యను పెంచేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఈ చర్య కూడా ఒక భాగమని సీఎం కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ‘ఢిల్లీ ప్రభుత్వం కరోనా పరీక్ష సామర్థ్యాన్ని అనేక రెట్లు పెంచింది. కరోనా పరీక్షలకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ అడగవద్దని ఈ రోజు ఉదయం ఆరోగ్య శాఖ మంత్రికి ఆదేశాలు ఇచ్చాను. ఇక నుంచి ఏ వ్యక్తి అయినా సులభంగా పరీక్ష చేసుకోవచ్చు’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. రోజుకు సుమారు 3 వేల కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.