యాప్నగరం

డాక్టర్ చెంప పగలగొట్టిన నర్సు.. కోవిడ్ ఆస్పత్రిలో షాకింగ్

కరోనా రోగి డెత్ సర్టిఫికెట్ కోసం కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వచ్చారు. మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని నర్సుని అడగడంతో ఆమె డ్యూటీ డాక్టర్‌కి చెప్పింది. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.

Samayam Telugu 28 Apr 2021, 9:09 pm
కరోనా కేసుల రద్దీతో ఆస్పత్రుల్లో ఖాళీ ఉండడం లేదు. పని ఒత్తిడి ఎక్కువై ఆ ప్రభావం సిబ్బంది ప్రవర్తనపై పడుతోంది. పని భారంతో ఒత్తిడికి గురైన ఓ నర్సు.. ఏకంగా డాక్టర్ చెంప పగలగొట్టిన షాకింగ్ ఘటన కోవిడ్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. నర్సు చేయిచేసుకోవడంతో ఆగ్రహానికి గురైన డాక్టర్ తిరిగి ఆమెను కొట్టాడు. ఇద్దరూ ఘర్షణ పడుతుండగా వీడియో తీయడంతో వైరల్‌గా మారింది. ఈ షాకింగ్ ఘటన యూపీలో జరిగింది.
Samayam Telugu డాక్టర్‌తో గొడవ పడుతున్న నర్సు
doctor slap


రాంపూర్‌లోని ఓ కోవిడ్ ఆస్పత్రిలో ఇటీవల ప్రాణాలు కోల్పోయిన కరోనా రోగి కుటుంబ సభ్యులు డెత్ సర్టిఫికెట్ కోసం వచ్చారు. మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని నర్సుని అడిగారు. అదే విషయం ఆమె డాక్టర్ వద్దకు వెళ్లి చెప్పింది. అందుకు ఆయన లెటర్ రాసుకురమ్మని చెప్పడంతో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. పని ఒత్తిడిలో ఉన్న నర్సు కోపంతో ఊగిపోయింది. డాక్టర్ చెంప చెళ్లుమనిపించింది.

ఊహించని ఘటనతో షాక్‌కి గురైన డాక్టర్ తేరుకుని ఆమెను తిరిగి కొట్టాడు. ఇద్దరి మధ్య ఘర్షణను కొందరు వీడియో తీయడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోవిడ్ ఆస్పత్రుల్లో డ్యూటీతో సిబ్బంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అయితే ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని రాంపూర్ పోలీసులు తెలిపారు. అయితే జిల్లా కలెక్టర్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.