యాప్నగరం

సచివాలయానికి బయలుదేరిన పన్నీరుసెల్వం

తమిళనాడు ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడిన తర్వాత అపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం తొలిసారిగా

Samayam Telugu 13 Feb 2017, 12:01 pm
తమిళనాడు ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడిన తర్వాత అపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం తొలిసారిగా సచివాలయాన్ని సందర్శించనున్నారు. మరికాసేపట్లో ఆయన సచివాలయానికి బయలుదేరుతారని సమాచారం. ఆదివారం కువత్తూర్ రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలతో భేటీ అయిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ సచివాలయం స్వాధీనం చేసుకుంటామని ప్రకటించిన మరునాడే ఓపీఎస్ సెక్రటేరియట్ కు బయలుదేరడం గమనార్హం. దీంతో పోలీసులు సచివాలయానికి భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
Samayam Telugu o panneerselvam visits secretariat today
సచివాలయానికి బయలుదేరిన పన్నీరుసెల్వం


ఒకవైపు శశికళ తన శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా..ఓపోఎస్ కు ఏడుగురి ఎమ్మెల్యేల మద్దతు లభించింది. ఇంకా మరికొంతమంది తనవైపు వస్తారని ఆయన చెబుతున్నారు. ఆదివారం పలువురు ఎంపీ ఆయనతో జతకట్టిన సంగతి తెలిసిందే. సోమవారం ఆయన ఇంటివద్ద అభిమానులు, కార్యకర్తల కోలాహలం నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.