యాప్నగరం

శోభా డే వెటకారపు ట్వీట్.. ఆ పోలీస్ పాలిట వరమైంది

ప్రముఖ కాలమిస్ట్ శోభా డే చేసిన ఒక్క తప్పుడు ట్వీట్ మధ్యప్రదేశ్ పోలీస్ ఇన్సెప్టెకర్ దౌలత్‌రామ్ జోగావత్ పాలిట వరమైంది.

TNN 26 Feb 2017, 9:08 pm
ప్రముఖ కాలమిస్ట్ శోభా డే చేసిన ఒక్క తప్పుడు ట్వీట్ మధ్యప్రదేశ్ పోలీస్ ఇన్సెప్టెకర్ దౌలత్‌రామ్ జోగావత్ పాలిట వరమైంది. ముంబై ఎన్నికల సందర్భంగా... భారీ బందోబస్త్ అంటూ అధిక బరువుతో బాధపడుతున్న జోగావత్ ఫొటోను ఆమె ట్వీట్ చేసింది. ముంబై పోలీసులను ఉద్దేశించి ఆమె ట్వీట్ చేయగా.. అతడు మధ్యప్రదేశ్‌కు చెందిన పోలీసని తేలడంతో.. శోభా డే వివాదంలో చిక్కుకున్నారు. నాకు ఆమె చికిత్స చేయిస్తారా అంటూ దౌలత్‌రామ్ మీడియా ముందు వాపోయారు. శోభా డే ఆయనకు చికిత్స చేయించడానికి ముందుకు రాకపోయినప్పటికీ.. ముంబైకి చెందిన ఓ హాస్పిటల్ మాత్రం ముందుకొచ్చింది. దీంతో ఆయన బరువును తగ్గించుకోవడం కోసం ముంబై వెళ్లారు.
Samayam Telugu obese madhya pradesh inspector leaves for mumbai to undergo check up
శోభా డే వెటకారపు ట్వీట్.. ఆ పోలీస్ పాలిట వరమైంది


చదవండి: ​ నా చికిత్సకయ్యే ఖర్చును శోభా డే భరిస్తారా?: పోలీస్ ప్రశ్న

శోభా ట్వీట్ వివాదాలను గమనించిన ముంబైకి చెందిన ‘సెంటర్ ఫర్ ఒబేసిటీ అండ్ డైజెస్టివ్ సర్జరీ’ జోగావత్‌ను సంప్రదించింది, ఆయనకు చికిత్స అందించేందుకు ముందుకొచ్చింది. ఆ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ ఫ్లాయిడ్ డిసౌజా మధ్యప్రదేశ్‌లో దౌలత్‌రామ్ విధులు నిర్వహిస్తోన్న నీముచ్ వచ్చి మరీ ఆయన్ను వెంట తీసుకెళ్లారు. ఈ విషయంలో తనకు అండగా నిలిచిన మీడియాకు జోగావత్ ధన్యవాదాలు తెలిపారు. మెరుగైన జీవితాన్ని పొందనున్నానంటూ ఆయన మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు. 1993లో ఆపరేషన్ జరగ్గా.. హార్మోన్ల అసమతౌల్యత కారణంగా దౌలత్‌రామ్ 180 కిలోల దాకా బరువు పెరిగారు. ఈ వివాదానికి కారణమైన శోభా మాత్రం.. డైటిషియన్‌ను సంప్రదించాలంటూ దౌలత్‌రామ్‌కు సలహా ఇచ్చారు.

Heavy police bandobast in Mumbai today! pic.twitter.com/sY0H3xzXl3 — Shobhaa De (@DeShobhaa) February 21, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.