యాప్నగరం

ఢిల్లీలో మళ్లీ ప్రారంభమైన సరి - బేసి విధానం

ఢిల్లీలో జనవరిలో ప్రయోగాత్మకంగా పదిహేను రోజుల పాటూ నడిచిన సరి - బేసి విధానం... మళ్లీ ఇప్పుడు అమల్లోకి వచ్చింది.

TNN 15 Apr 2016, 10:52 am
ఢిల్లీలో జనవరిలో ప్రయోగాత్మకంగా పదిహేను రోజుల పాటూ నడిచిన సరి - బేసి విధానం... మళ్లీ ఇప్పుడు అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వరకు రెండోసారి ప్రయోగాత్మకంగా అమల్లో ఉంటుంది. ఈ రోజు ఢిల్లీ రోడ్ల మీదకి కేవలం బేసి సంఖ్యతో ముగిసే కార్లకే అనుమతి ఉంది. అలా కాకుండా సరి సంఖ్యతో ముగిసే కార్లతో బయటికి వస్తే... రూ.2000 జరిమానా విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఈసారి ఢిల్లీ ప్రభుత్వం కొంత ఊరటనిచ్చే నిర్ణయాలని అమలు పరిచింది. మహిళలు డ్రైవ్ చేసే కార్లు, కార్లలో యూనిఫారంతో పిల్లలు ఉన్నా, వీఐపీ కార్లు, సీఎన్ జీ వాహానాలకు ఈ నిబంధన వర్తించదు. అయితే ఆప్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు మాత్రం సామాన్యప్రజలకు వర్తించే నిబంధనే ఉంటుంది. అంటే వీరు వీఐపీలుగా నచ్చిన కార్లలో బయటికి రాకూడదు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు సరి-బేసి విధానంలోని నియమాలు అమల్లో ఉంటాయి. అర్థరాత్రి మాత్రం ఏ నెంబర్ కార్లలో అయినా తిరగొచ్చు.
Samayam Telugu odd even sceme back in delhi
ఢిల్లీలో మళ్లీ ప్రారంభమైన సరి - బేసి విధానం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.