యాప్నగరం

ఒడిశాలో ఎదురుకాల్పులు.. ఐదుగురు మావోల మృతి

ఒడిశా మల్కన్ గిరి జిల్లా అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు.. ఐదుగురు మావోయిస్టులు మృతి.. కాల్పుల నుంచి తప్పించుకున్న అగ్రనేత రణదేవ్.

Samayam Telugu 5 Nov 2018, 10:19 am
ఒడిశాలో ఎన్‌కౌంటర్ జరిగింది. మల్కన్‌గిరి జిల్లా బెజ్జింగ్‌వాడ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు.. మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరువురి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే మావోయిస్టు అగ్రనేత రణదేవ్ అక్కడి నుంచి తప్పించుకున్నట్లు సమాచారం.
Samayam Telugu Mavos.


అటవీ ప్రాంతంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ముందస్తు జాగ్రత్తగా అదనపు బలగాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ఇటీవలే మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో చెలరేగిపోయారు. మాటువేసి కాల్పులు జరిపి, ఇద్దరు పోలీసులతో పాటూ దూరదర్శన్‌ (డీడీ)కు చెందిన ఒక కెమెరామెన్‌ను బలితీసుకున్నారు. ఈ ఘటనలో మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.

అంతక ముందు కూడా బీజాపూర్‌ జిల్లాలో తనిఖీలకు వెళ్లివస్తున్న భద్రతా బలగాల మైన్‌ప్రూఫ్‌ వాహనాన్ని శక్తిమంతమైన మందుపాతరతో పేల్చేశారు. ఈ ఘటనలో ఐదుగురు సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారు. వరుస ఘటనలతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఏవోబీ సరిహద్దుల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఎదురు కాల్పులు జరిగాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.