యాప్నగరం

కరెంట్ షాక్‌తో 7 గజరాజులు మృతి.. క్రైం బ్రాంచ్‌కు దర్యాప్తు బాధ్యత

అనుమానాస్పద రీతిలో ఏడు ఏనుగులు మృతి.. ఘటనపై సర్కార్ సీరియస్.. క్రైం బ్రాంచ్‌తో దర్యాప్తునకు ఆదేశం..

Samayam Telugu 28 Oct 2018, 12:02 pm
కరెంట్ షాక్‌తో ఏడు ఏనుగులు చనిపోవడం సంచలనంగా మారింది. ఈ ఘటన ఒడిశాలో తీవ్ర కలకలంరేపడంతో.. సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. క్రైం బ్రాంచ్‌కు ఈ బాధ్యతల్ని అప్పగిస్తూ సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశాలు జారీ చేశారు. గజరాజుల మరణం వెనుక ఏదైనా కుట్ర ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేయబోతున్నారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు అధికారుల్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే అటవీశాఖ రేంజ్‌ ఆఫీసర్‌తో పాటూ మరో ముగ్గురిపైనా వేటు పడింది.
Samayam Telugu Odisha.


ఒడిశాలోని థెన్‌కెనాల్‌లోని సదర్ ఫారెస్ట్ రేంజ్‌లో రెండు రోజుల క్రితం ఏడు ఏనుగులు చనిపోయాయి. కిందకు వేలాడుతున్న కరెంట్ వైర్లు తాకి ఓ టస్కర్, ఐదు ఆడ, ఏనుగులతో సహా మొత్తం ఏనుగులు అక్కడికక్కడే మరణించాయి. వీటిని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. చనిపోయిన వాటిలో మూడు రోడ్డుపై.. మరో మూడు పక్కనే ఉన్న కాలువలో పడి ఉన్నాయి. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని విచారణకు ఆదేశించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.