యాప్నగరం

మహిళా మంత్రి హ్యాండ్ బ్యాగ్ కొట్టేసిన దొంగలు!

పూరి-దుర్గ్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒడిశా మంత్రి ఉషా దేవి హ్యాండ్‌బ్యాగ్‌ను దొంగలు తస్కరించారు. దీనిపై ఆమె రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైరఖోల్‌- అంగుల్‌ స్టేషన్ల మధ్య హ్యాండ్‌ బ్యాగ్‌ అపహరణకు గురైనట్లు ఆమె తెలిపారు.

TNN 11 Nov 2017, 4:23 pm
దొంగలకు ఛాన్స్ దొరికితే ఎదుటివారు ఎంతటివారైతేనేం.. తమదైన చోర కళా నైపుణ్యంతో ఇట్టే కంగుతినిపిస్తారు. తాజాగా ఏకంగా ఓ రాష్ట్ర మంత్రే అలాంటి చోరుల బారిన పడ్డారు. అవును.. పూరి-దుర్గ్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒడిశా మంత్రి ఉషా దేవి హ్యాండ్‌బ్యాగ్‌ను దొంగలు తస్కరించారు. దీనిపై ఆమె రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైరఖోల్‌- అంగుల్‌ స్టేషన్ల మధ్య హ్యాండ్‌ బ్యాగ్‌ అపహరణకు గురైనట్లు ఆమె తెలిపారు. ఆమె భువనేశ్వర్‌ నుంచి రైలులో మరో ప్రాంతానికి ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.
Samayam Telugu odisha minister usha devis handbag stolen from train
మహిళా మంత్రి హ్యాండ్ బ్యాగ్ కొట్టేసిన దొంగలు!


హ్యాండ్‌ బ్యాగ్‌లో రూ.25000 నగదు, మొబైల్‌ ఫోన్‌, ఐడీ కార్డుతో పాటు మరికొన్ని విలువైన వస్తువులు ఉన్నట్లు ఉషా దేవి తెలిపారు. మంత్రి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తితాల్‌గఢ్‌ జీఆర్‌పీ పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.