యాప్నగరం

ఈర్ష్యతోనే పార్శిల్ బాంబ్.. ఏడు నెలల స్టడీ, ట్రయల్ రన్స్

పార్శిల్ బాంబు కారణంగా వరుడు, అతడి నానమ్మ మరణించిన ఘటనలో గుట్టు వీడింది. తన కొలీగ్‌పై ఈర్ష్య పెంచుకున్న ఓ ప్రబుద్ధుడు చేసిన ఘన కార్యం ఫలితంగా నిండు ప్రాణాలు బలయ్యాయి.

Samayam Telugu 26 Apr 2018, 2:12 pm
గత ఫిబ్రవరిలో ఒడిశాలో గిఫ్ట్ బాంబ్ పేలిన ఘటనలో వరుడు, అతడి నానమ్మ మరణించిన సంగతి గుర్తుందా..? ఫిబ్రవరి 23న ఈ ఘటన జరగ్గా.. అన్ని కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు.. ఎట్టకేలకు కేసును చేధించారు. వృత్తిపరమైన అసూయ కారణంగానే పుంజిలాల్ మెహర్ అనే కాలేజీ లెక్చరర్ ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. ఇంతకూ ఏం జరిగింది..? అతడి ఈర్ష్యకు కారణమేంటి..? వివరాలు..
Samayam Telugu gift bomb


ఫిబ్రవరి 18న సౌమ్య అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌కు రీమా సాహు అనే అమ్మాయితో పెళ్లయ్యింది. ఐదు రోజుల తర్వాత తమకు వచ్చిన గిఫ్ట్‌లను తెరచి చూస్తుండగా.. ఓ పార్శిల్ ఓపెన్ చేశారు. తెరవగానే.. అది పేలడంతో.. సౌమ్యతోపాటు పక్కనే ఉన్న అతడి నామమ్మ మరణించారు. వధువుకి తీవ్ర గాయాలయ్యాయి.

వరుడి తల్లి కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పని చేస్తోంది. తనను కాదని ప్రిన్సిపాల్ పోస్టుకు తనను ఎంపిక చేశారని పుంజిలాల్ మెహర్ అనే తోటి ఉద్యోగి ఆమెపై పగ పెంచుకున్నాడు. ఫ్యామిలీ మొత్తాన్ని లేపేయాలని ప్లాన్ వేశాడు.

చదవండి: పేలిన గిఫ్ట్ బాంబ్: వరుడి దుర్మరణం,వధువు పరిస్థితి విషమం

అందులో భాగంగా ఇంటర్నెట్‌లో పరిశోధించి.. ఏడు నెలలపాటు కష్టపడి పార్శిల్ బాంబ్ తయారు చేయడం ఎలాగో నేర్చుకున్నాడు. సరిగా పేలుతుందో లేదో రూఢీ చేసుకోవడం కోసం చిన్న చిన్న బాంబులతో ట్రయల్స్ వేశాడు. అంతా ఓకే అనుకున్నాక.. పెళ్లి గిఫ్ట్‌గా పార్శిల్‌ను కొరియర్ చేసి వరుణ్ని, అతడి నానమ్మను పొట్టనబెట్టుకున్నాడు. ఆ పార్శిల్ తెరిచిన సమయంలో వరుడి తల్లిదండ్రులు ఇంట్లో లేరు. దీంతో వారికి ప్రమాదం తప్పింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.