యాప్నగరం

ప్రియుడి మర్మాంగాన్ని కోసేసిన వివాహిత

బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Samayam Telugu 11 Nov 2018, 4:35 pm
భర్త కళ్లుగప్పి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధాలు కొనసాగించింది. అయితే ఓ విషయంలో వివాదం రావడంతో ప్రియుడి మర్మాంగాన్ని కత్తితో కోసి పారేసింది. ఒడిశాలోని కెందుఝర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Samayam Telugu Chopps Off Genital


డిఎస్పీ జేమ్స్ టొప్పో కథనం ప్రకారం.. కెందుఝర్ జిల్లా బదౌగావ్ గ్రామానికి చెందిన కమలా పాత్రకు ఝరబెడా గ్రామానికి చెందిన రాజేంద్ర నాయక్(25)తో పరిచయం ఏర్పడింది. వివాహిత రాజేంద్రతో శారీరక సంబంధాలు కొనసాగించింది. చెన్నైలోని ప్రైవేట్ కంపెనీలో పనిచేసే రాజేంద్ర ఇటీవల ఇంటికి వచ్చిన సమయంలో కమలను కలిశాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ గొడవపడ్డారు. అయినా ఆరోజు రాత్రి కమల ఇంట్లోనే నిద్రపోయాడు..

గాఢనిద్రలోకి జారుకున్న సమయంలో పదునైన కత్తితో రాజేంద్ర మర్మాంగాన్ని ప్రియురాలు కమల కోసిపారేసింది. బాధితుడి అరుపులు విన్న స్థానికులు పరిస్థితి గమనించి రాజేంద్రను చికిత్స నిమిత్తం హరిచందన్ పూర్ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కటక్‌లోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. తనను తిట్టాడన్న కారణంగా ప్రియుడి పురుషాంగాన్ని కత్తిరించానని పోలీసుల విచారణలో కమల అంగీకరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.