యాప్నగరం

ఢిల్లీ ఏపీ, తెలంగాణ భవన్‌పై వివాదం

ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్ పై ఇరు రాష్ట్రాల అధికారులపై వివాదం రాజుకుంది.

Samayam Telugu 8 May 2017, 2:55 pm
ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్ పై ఇరు రాష్ట్రాల అధికారులపై వివాదం రాజుకుంది. భవన్ లో తమకు కేటాయించాల్సిన గదులను ఏపీ అధికారులు వినియోగిస్తున్నారని తెలంగాణ అధికారులు ఆరోపిస్తున్నారు. దీంతో రాష్ట్రానికి చెందిన ప్రముఖులు ఢిల్లీ వస్తే వారికి కేటాయించడానికి గదులు లేవని చెబుతున్నారు.
Samayam Telugu officials clash over ap telangan bhavan in delhi
ఢిల్లీ ఏపీ, తెలంగాణ భవన్‌పై వివాదం


రాష్ట్ర విభజన అనంతరం ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ బంగ్లాలోనే రెండు రాష్ట్రాలకు గదులు పంచారు. తెలంగాణకు 42శాతం గదులు, ఇతర ఆఫీసులు కేటాయించారు. అయితే ఈ మధ్య తమకు చెందిన గదులకు కూడా తెలంగాణ అధికారులు తాళాలు వేస్తున్నారని ఏపీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అధికారులు వేసిన తాళాలను ఏపీ అధికారులు పగులకొట్టించారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వివాదం నెలకొంది. ఒకరిపై ఒకరు రెసిడెంట్ కమీషనర్లకు ఫిర్యాదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.