యాప్నగరం

పెట్రోల్‌ నింపుతుండగా.. మంటలు!

బైక్‌లో పెట్రోల్‌ నింపుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో..

TNN 20 May 2017, 4:21 pm
బైక్‌లో పెట్రోల్‌ నింపుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ పెట్రోల్ బంకులో ఉన్నవారు తమ బైక్‌లు పక్కన పడేసి పరుగు అందుకున్నారు. అందులో కొంత మంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ బంక్‌లో పని చేస్తున్న ఓ ఉద్యోగి మరణించాడు. ఒక్కసారిగా కలవరపాటుకు గురి చేసిన ఈ అగ్ని ప్రమాదం సూరత్‌లోని ఓ పెట్రోల్‌ బంక్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి. ఒక్కసారిగా చెలరేగిన మంటలను ఆర్పడం కోసం రాజ్‌కుమార్‌ అనే ఉద్యోగి అగ్నిమాపక సిలిండర్‌ను తెరవడానికి ప్రయత్నించాడు. కానీ, అది ఒక్కసారిగా పేలడంతో.. దానికి సంబంధించిన ఒక మేకు అతడి మెడపై బలంగా గుచ్చుకుంది.
Samayam Telugu on cam bike catches fire at petrol pump in surat
పెట్రోల్‌ నింపుతుండగా.. మంటలు!


స్థానికులు వెంటనే రాజ్‌కుమార్‌ను హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఎండలో చాలా దూరం ప్రయాణించడంతో బాగా హీటెక్కి ఉన్న బైక్.. ఇంజిన్ భాగంపై పెట్రోల్ పడటంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటన ఏవిధంగా చోటు చేసుకుంది అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.