యాప్నగరం

వీడియో: వరద నీటిలో తెగింపు.. బైక్‌తో పాటు కొట్టుకుపోయిన యువకులు

మహారాష్ట్రలో వరదల బీభత్సం కొనసాగుతోంది. జల్నా ప్రాంతంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు.

Samayam Telugu 18 Aug 2020, 3:03 pm
భారీ వర్షాలు దేశంలోని పలు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. మహారాష్ట్రలో వర్షాల బీభత్సం కొనసాగుతోంది. వర్షంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు వాహనంతో పాటు వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. జల్నా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి.
Samayam Telugu వరదల్లో కొట్టుకుపోయిన బైక్
Biker swept away in flood water in Maharashtra


వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నా.. వారు బైక్‌ను అలాగే ముందుకు పోనిచ్చారు. దీంతో ప్రమాదంలో పడ్డారు. అది గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు రోడ్లపై పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లను ముంచెత్తుతున్నాయి.

మరోవైపు.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌తో పాటు ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.

Also Read: వదినపై ప్రేమతో అన్న ఆత్మహత్య.. అది తట్టుకోలేక చెల్లి సూసైడ్

Must Read: మహిళా ఎస్‌ఐ పనికి కలెక్టర్ ఫిదా.. డయాస్‌పైనే సెల్యూట్, వీడియో వైరల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.