యాప్నగరం

కరోనా పరీక్ష చేసుకోమంటే స్టేషన్ నుంచి జనం పరుగులు.. షాకింగ్ వీడియో!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. భారత్‌లోకి మహమ్మారి ప్రవేశించి 16 నెలల దాటిపోగా.. పాజిటివ్ కేసులు వరుసగా మూడు రోజుల నుంచి రెండు లక్షలకుపైగా నమోదవుతున్నాయి.

Samayam Telugu 17 Apr 2021, 12:47 pm
పదుల సంఖ్యలో జనం రైల్వే స్టేషన్ నుంచి బయటకు పరుగులు తీస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడేదో ప్రమాదం జరిగిందనుకుంటే పొరపాటే. కరోనా టెస్ట్‌ల నుంచి తప్పించుకోడానికే అలా పరుగులు తీస్తున్నారు. బిహార్‌లోని బక్సార్ రైల్వే స్టేషన్‌లో గురువారం నాటి ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

గాలి ద్వారా కరోనా.. ఇవిగో పక్కా ఆధారాలు: లాన్సెట్ సంచలన నివేదిక
రైలు దిగి స్టేషన్ నుంచి బయటకు వచ్చిన ఓ వ్యక్తిని కోవిడ్-19 పరీక్ష చేయించుకోవాలని ఆరోగ్య కార్యకర్త అడుగుతుంటే ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. దేశంలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చడంతో వివిధ ప్రాంతాల నుంచి బిహార్‌కు వచ్చే స్థానికులకు రైల్వే స్టేషన్‌లలో కరోనా పరీక్షల కోసం ఏర్పాట్లుచేయాలని సీఎం నితీశ్ కుమార్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికారులు రైల్వే స్టేషన్‌లో స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా నగదు, మద్యం.. ఐదు రాష్ట్రాల్లో రూ.వెయ్యి కోట్లు సీజ్!
‘‘స్క్రీనింగ్ పరీక్షల కోసం ప్రయాణికులను మేము ఆపుతుంటే వాగ్వాదానికి దిగుతున్నారు.. ఈ సమయంలో పోలీసులు ఎవరూ స్టేషన్‌లో లేరు.. అయితే, తర్వాత ఓ మహిళా పోలీస్ వచ్చినా తాను ఏం చేయాలేనని చేతులెత్తేసింది’’ అని స్థానిక ఆరోగ్య కార్యకర్త జయ్ తివారీ తెలిపారు. లాక్‌డౌన్ భయంతో ముంబయి, పుణే, ఢిల్లీల నుంచి పెద్ద సంఖ్యలో వలస కార్మికులు బిహార్‌కు చేరుకుంటున్నారు.
శుభవార్త చెప్పిన ఐఎండీ.. ఈ ఏడాదీ సాధారణంగా నైరుతి రుతుపవనాలు
ముంబయి, పుణే, ఢిల్లీ వంటి నగరాలలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గతేడాది దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా పలు పెద్ద నగరాలు, పట్టణాల నుంచి వలస కూలీలు స్వస్థలాలకు చేరుకోడానికి నానా అగచాట్లు పడ్డారు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే సొంతూళ్లకు చేరుకుంటున్నారు. బిహార్‌లో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు సీఎం నితీశ్ కుమార్ శుక్రవారం అత్యున్నత సమావేశం ఏర్పాటుచేశారు.
అట్టుడుకుతున్న పాక్.. ఏడుగురు మృతి, 600 మంది పోలీసులకు గాయాలు!
కరోనా కారణంగా ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులను ఈ ఏడాది కూడా పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తున్నట్లు బిహార్ ప్రకటించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా పాఠశాలల నిర్వహణకు ఆటంకాలు ఎదురవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక, రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం నితీశ్ శనివారం అఖిలపక్షం సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.