జమ్మూ కాశ్మీర్ మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. బుధవారం ఉదయం శ్రీనగర్లోని ఫతేహ్ హడల్ ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. టెర్రరిస్టుల కదిలికలు ఉండటంతో.. ముందస్తు జాగ్రత్తగా ఇంటర్నెట్ సేవలు, స్కూళ్లు, షాపుల్ని మూసివేసి ఆపరేషన్ మొదలు పెట్టారు. ఉగ్రమూకలు ఉన్న భవనాన్ని చుట్టుముట్టారు.
భద్రతా బలగాల రాకను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. బలగాలు కూడా ఎదురు కాల్పులతో ధీటుగా సమాధానమిచ్చాయి. ఈ హోరా హోరీ పోరులో ముగ్గురు ఉగ్రవాదుల్ని బలగాలు మట్టుబెట్టాయి. కాని దురదృష్టవశాత్తూ ఉగ్రమూకల కాల్పుల్లో ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. టెర్రరిస్టుల దగ్గర నుంచి ఆయుధాలతో పాటూ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
భద్రతా బలగాల రాకను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. బలగాలు కూడా ఎదురు కాల్పులతో ధీటుగా సమాధానమిచ్చాయి. ఈ హోరా హోరీ పోరులో ముగ్గురు ఉగ్రవాదుల్ని బలగాలు మట్టుబెట్టాయి. కాని దురదృష్టవశాత్తూ ఉగ్రమూకల కాల్పుల్లో ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. టెర్రరిస్టుల దగ్గర నుంచి ఆయుధాలతో పాటూ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.