యాప్నగరం

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్‌‌లో ఓ భవనంలో నక్కిన ఉగ్రవాదులు.. భవనాన్ని చుట్టుముట్టి ముగ్గుర్ని మట్టుబెట్టిన బలగాలు.. ఎదురు కాల్పుల్లో ఓ పోలీసు అధికారి వీరమరణం.

Samayam Telugu 17 Oct 2018, 1:14 pm
జమ్మూ కాశ్మీర్‌ మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. బుధవారం ఉదయం శ్రీనగర్‌లోని ఫతేహ్‌ హడల్ ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. టెర్రరిస్టుల కదిలికలు ఉండటంతో.. ముందస్తు జాగ్రత్తగా ఇంటర్నెట్ సేవలు, స్కూళ్లు, షాపుల్ని మూసివేసి ఆపరేషన్ మొదలు పెట్టారు. ఉగ్రమూకలు ఉన్న భవనాన్ని చుట్టుముట్టారు.
Samayam Telugu Encounter.


భద్రతా బలగాల రాకను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. బలగాలు కూడా ఎదురు కాల్పులతో ధీటుగా సమాధానమిచ్చాయి. ఈ హోరా హోరీ పోరులో ముగ్గురు ఉగ్రవాదుల్ని బలగాలు మట్టుబెట్టాయి. కాని దురదృష్టవశాత్తూ ఉగ్రమూకల కాల్పుల్లో ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. టెర్రరిస్టుల దగ్గర నుంచి ఆయుధాలతో పాటూ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.