యాప్నగరం

స్టేషన్‌పై ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి.. పోలీసు దుర్మరణం

ప్రాణాలు కాపాడుకోవాోలలంటే ఉద్యోగాలను వదిలపెట్టాలని కశ్మీర పోలీసులను బెదిరిస్తోన్న ఉగ్రవాదులు.. పోలీస్ స్టేషన్‌పై దాడికి తెగబడ్డారు. గ్రెనేడ్‌తో దాడి చేసి పోలీసు ప్రాణం తీశారు.

Samayam Telugu 30 Sep 2018, 10:13 am
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఆగడాలు తగ్గడం లేదు. షోపియాన్ జిల్లాలో ఆదివారం ఉగ్రదాడిలో ఓ పోలీసు ప్రాణాలు కోల్పోయాడు. పోలీస్ స్టేషన్‌పై గ్రెనేడ్ విసిరిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. గ్రెనేడ్ దాడిలో ఓ పోలీస్ గాయపడగా.. వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు వదిలారు. అమరుడైన పోలీసును జవూరాకు చెందన షకీబ్ మోహివుద్దీన్‌గా గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు.. ఎదురు కాల్పులు ప్రారంభించాయి.
Samayam Telugu jk police1


దాడికి పాల్పడిన ఉగ్రవాదులు సమీపంలోని అడవిలోకి పారిపోయారని భద్రతాదళాలు తెలిపాయి. ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది.. ఉగ్రవాదుల జాడ కోసం జల్లెడ పడుతున్నారు.

కశ్మీర్ పోలీసులు వెంటనే ఉద్యోగాలు వదిలిపెట్టాలని, లేదంటే చంపేస్తామని ఉగ్రవాదులు హెచ్చరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇళ్ల నుంచి నలుగురు పోలీసుల్ని ఎత్తుకెళ్లిన ముష్కరులు ఇటీవలే ముగ్గుర్ని దారుణంగా హతమార్చడం కశ్మీర్లో కలకలం రేపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.