యాప్నగరం

కేవలం బీజేపీ వల్లే సాధ్యం: మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోమారు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.

TNN 10 Feb 2017, 7:05 pm
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోమారు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఈ అవినీతి, పేద వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ వల్ల ఒరిగేదేమి లేదని కేవలం బీజేపీ వల్లే ఉత్తరాఖండ్‌లో అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం హరిద్వార్‌లోని ‘వికాశ్ సంకల్ప్ ర్యాలీ’లో పాల్గొన్న మోదీ.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసారు.
Samayam Telugu only a bjp goverment can take uttarakhand to new heights pm modi
కేవలం బీజేపీ వల్లే సాధ్యం: మోదీ


‘ప్రస్తుతం ఉన్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అందరికీ తెలుసు. కానీ ఇప్పటికీ ఆ పార్టీ నేతలకు చీమకుట్టినట్లు కూడా లేదు. ఈ పవిత్ర భూమిని ఇలాంటి అవీనితి ప్రభుత్వమా పాలించేది? ఉత్తరాఖండ్‌కు రెండు ఇంజన్లు కావాలి. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటే.. కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్‌ను ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది’ అని మోదీ అన్నారు.

కేదార్‌నాథ్‌లో ప్రకృతి విళయం సృష్టిస్తే.. కాంగ్రెస్ నేతలు మాత్రం విదేశీ పర్యటనల్లో బిజీగా గడిపారని, దేశం దీన్ని ఎన్నటికీ మరిచిపోదని మోదీ మండిపడ్డారు. సర్జికల్ స్ట్రైక్‌లో మన భద్రతా దళాలు ధైర్య సాహసాలు ప్రదర్శిస్తే.. దాన్ని వ్యతిరేకించిన కొంత మంది నాయకులు రాజకీయాలు చేసారని కాంగ్రెస్ నేతలనుద్దేశించి అన్నారు. పేదరకాన్ని తరిమికొట్టి రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇవ్వగల ఏకైక పార్టీ బీజేపీనేనని మోదీ వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.