యాప్నగరం

పాక్‌తో చర్చలకు అదొక్కటే మిగిలింది.. ఆ 300 మందితోనే సమస్య: రాం మాధవ్

పాకిస్థాన్ చర్చలకు మిగిలిన ఏకైక అంశం.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను మనకు ఎప్పుడు అప్పగిస్తారనేదేనని బీజేపీ నేత రాం మాధవ్ తెలిపారు. కశ్మీర్లో పరిస్థితులు ప్రశాంతంగా ఉండటానికి 200-300 మందిని అదుపులోకి తీసుకోవడమే కారణమన్నారు.

Samayam Telugu 1 Oct 2019, 10:16 am
కశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయాలని పాకిస్థాన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. భారత్ మాత్రం ఇది అంతర్గత వ్యవహారం అని తేల్చి చెబుతోంది. పాకిస్థాన్‌తో చర్చల ప్రసక్తే లేదంటున్న భారత్.. దాయాదితో చర్చలంటూ జరిపితే అది పాక్ ఆక్రమిత కశ్మీర్ కోసమేనంటోంది. మాతో పెట్టుకుంటే అణు యుద్ధం తప్పదని హెచ్చరిస్తోన్న ఇమ్రాన్ ఖాన్‌కు బీజేపీ నేతలు ఘాటుగా సమాధానం ఇస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఈ అంశంపై మాట్లాడుతూ.. ఇక దాయాదితో చర్చలు జరపడం కోసం మిగిలిన ఏకైక అంశం.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగించడమే అన్నారు. అంతకు మించి మరో అంశంపై చర్చలు జరపాల్సిన అవసరం లేదన్నారు.
Samayam Telugu ram madhav


కశ్మీర్లో కర్ఫ్యూ అమల్లో ఉందని, వేల మంది బందీలుగా ఉన్నారన్న పాక్ ప్రధాని ఆరోపణలను రాం మాధవ్ ఖండించారు. ప్రస్తుతం 200-300 మందిని మాత్రమే అదుపులోకి తీసుకున్నామన్నారు.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో మాట్లాడిన రాం మాధవ్.. ఆర్టికల్ 370 రద్దు సమయంలో 2000-3000 మందిని అదుపులోకి తీసుకున్నామని.. ప్రస్తుతం 200-300 మంది మాత్రమే అదుపులో ఉన్నారని తెలిపారు. కశ్మీర్‌ల కోరికకు, ఈ 200-300 కోరికకు చాలా తేడా ఉందన్నారు.

Read Also: ఐరాస రాయబారిని మార్చిన పాక్, ఒత్తిడిలో ఇమ్రాన్!

200-250 మందిని అదుపులో తీసుకుంటే రెండు నెలలుగా కశ్మీర్ శాంతియుతంగా ఉందన్న రాం మాధవ్.. కశ్మీర్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో, వీరేం కోరుకుంటున్నారో అర్థం చేసుకోవాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.