తమిళనాడులో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే తన అభిమానులతో చర్చించిన సూపర్స్టార్ రజనీకాంత్ త్వరలోనే రాజకీయ రంగప్రవేశానికి నాంది పలికాడు. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ అన్ని స్థానాల్లో బరిలో ఉంటుందని కూడా ప్రకటించాడు. మరోవైపు కమల్హాసన్ కూడా రాజకీయ ప్రవేశానికి శ్రీకారం చుట్టాడు. ఫిబ్రవరి 21న బహిరంగసభ నిర్వహించి.. పార్టీ విధివిధానాలను ప్రకటించనున్నారు.
రజనీకాంత్, కమలహాసన్ రాజకీయాల్లో కలిసి పనిచేస్తే బాగుంటుందని కొందరు తమిళ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తంచేశారు. వీరిలో డ్యాన్స్మాస్టర్, హీరో లారెన్స్ కూడా ఉన్నారు. దీనిపై ఒక మీడియా సంస్థ రజనీకాంత్ని వివరణ కోరగా ''కాలమే అన్నింటికి సమాధానం చెబుతుంది'' అని సమాధానం ఇచ్చారు.
జయలలిత మరణం తర్వాత తమిళనాడులో నెలకొన్న రాజకీయ అస్థిరతకు ఈ హీరోల రాజకీయ ప్రవేశం ఎలాంటి మార్పు తీసుకురానుందో వేచి చూడాల్సిందే.
రజనీకాంత్, కమలహాసన్ రాజకీయాల్లో కలిసి పనిచేస్తే బాగుంటుందని కొందరు తమిళ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తంచేశారు. వీరిలో డ్యాన్స్మాస్టర్, హీరో లారెన్స్ కూడా ఉన్నారు. దీనిపై ఒక మీడియా సంస్థ రజనీకాంత్ని వివరణ కోరగా ''కాలమే అన్నింటికి సమాధానం చెబుతుంది'' అని సమాధానం ఇచ్చారు.
జయలలిత మరణం తర్వాత తమిళనాడులో నెలకొన్న రాజకీయ అస్థిరతకు ఈ హీరోల రాజకీయ ప్రవేశం ఎలాంటి మార్పు తీసుకురానుందో వేచి చూడాల్సిందే.