యాప్నగరం

అట్టుడుకుతున్న డార్జిలింగ్.. ఎస్సై మృతి

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో మరోసారి అట్టుడుకుతోంది. శుక్రవారం చెలరేగిన తీవ్రమైన అల్లర్ల కారణంగా ఓ ఎస్సై మరణించారు. మరో నలుగురు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) అధినేత బిమల్‌ గురుంగ్‌ మద్దతుదారులు జరిపిన కాల్పుల్లో ఎస్సై అమితాబ్ మల్లిక్ మృతి చెందారు.

TNN 14 Oct 2017, 1:50 pm
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో మరోసారి అట్టుడుకుతోంది. శుక్రవారం (అక్టోబర్ 13) చెలరేగిన తీవ్రమైన అల్లర్ల కారణంగా ఓ ఎస్సై మరణించారు. మరో నలుగురు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) అధినేత బిమల్‌ గురుంగ్‌ మద్దతుదారులు జరిపిన కాల్పుల్లో ఎస్సై అమితాబ్ మల్లిక్ మృతి చెందారు. ఓ అటవీ ప్రాంతంలో గురుంగ్‌ దాక్కున్నాడన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్‌కు వెళ్లగా ఈ ఘటన జరిగింది. పోలీసుల రాకను గుర్తించిన జీజేఎం మద్దతుదార్లు వారిపై రాళ్లు విసిరి, అనంతరం కాల్పులకు తెగబడ్డారు.
Samayam Telugu op to nab gjm neta sparks firefight near darjeeling cop killed 4 hurt
అట్టుడుకుతున్న డార్జిలింగ్.. ఎస్సై మృతి


పోలీసుల కాల్పుల్లో తమ మద్దతుదారులు ముగ్గురు చనిపోయారని జీజేఎం ప్రకటించింది. దీన్ని అధికారులు ధ్రువీకరించలేదు. గురుంగ్‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంతో.. గత ఆగస్టు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతడికి మావోయిస్టులతోనూ సంబంధాలున్నాయని పోలీసులు ఆరోపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.