యాప్నగరం

నోట్లరద్దుపై మోదీని కలిసిన ప్రతిపక్ష నేతలు

పెద్దనోట్ల రద్దు అనంతరం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీల నేతలు శుక్రవారం పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు.

Samayam Telugu 16 Dec 2016, 12:28 pm
పెద్దనోట్ల రద్దు అనంతరం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీల నేతలు శుక్రవారం పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. నోట్లరద్దుతో వివిధ వర్గాలు ఏవిధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో నేతలు మోదీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా ఈ మధ్య యూపీలో చేసిన రైతు యాత్రల సందర్భంగా..రాహుల్ దృష్టికి వచ్చిన వారి సమస్యలను మోదీకి వివరించినట్లు సమాచారం. రైతు రుణ మాఫీపై నేతలు పీఎంకు వినతి పత్రం సమర్పించారు.
Samayam Telugu opposition leaders led by rahul meet pm modi
నోట్లరద్దుపై మోదీని కలిసిన ప్రతిపక్ష నేతలు


రైతుల రుణాల మాఫీ కోసం రిలీఫ్ ఫండ్ విడుదల చేయాలని మోదీని కోరామని సమావేశం అనంతరం రాహుల్ మీడియాకు తెలిపారు. రైతుల పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని మోదీ అంగీకరించారని, కానీ రుణమాఫీ విషయంలో ఏమీ మాట్లాడలేదని రాహుల్ అన్నారు.

పండించిన పంటకు కనీస మద్దతు ధర, రైతుల ఆత్మహత్యలు, రుణాలపై ప్రధానితో చర్చించామని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరిందర్ సింగ్ తెలిపారు.

అనంతరం ప్రతిపక్ష నేతలంతా కలిసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. నోట్లరద్దు అనంతరం కేంద్రప్రభుత్వ విధానాల వల్లే ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ అంశాలపైనే పార్లమెంటులో చర్చ చేపట్టాలని తాము డిమాండ్ చేశామని..నేతలు ప్రణబ్‌కు వివరణ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.