యాప్నగరం

లోక్‌సభను తాకిన రాజ్యసభ రాజకీయ సెగ.. సమావేశాలు బాయ్‌కాట్

Parliament Monsoon Session: వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో చోటు చేసుకున్న పరిణామాలు పార్లమెంట్‌ను కుదిపేస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Samayam Telugu 22 Sep 2020, 7:32 pm
రాజ్యసభ రభస లోక్‌సభకు కూడా పాకింది. పెద్దల సభ నుంచి సస్పెండైన 8 మంది ఎంపీలకు సంఘీభావంగా విపక్ష పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. లోక్‌సభ కార్యకలాపాలను బాయ్‌కాట్‌ చేస్తున్నట్టు ప్రకటించాయి. రాజ్యసభ నుంచి సస్పెండై దీక్ష కొనసాగిస్తున్న ఎంపీలకు సంఘీభావంగా కొన్ని ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్‌ సమావేశాలను బహిష్కరిస్తున్నాయని కాంగ్రెస్‌ సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధురి మంగళవారం (సెప్టెంబర్22) ప్రకటించారు.
Samayam Telugu పార్లమెంట్
Parliament monsoon session


వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో ఆదివారం గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. విపక్ష సభ్యులు రూల్ బుక్‌ను చించివేసి డిప్యూటీ ఛైర్మన్ పైకి విసిరేశారు. కొంత మంది బల్లలపై ఎక్కి నిలబడి నినాదాలు చేశారు. తనను అనుచిత పదజాలంతో దూషించారని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు.

మరోవైపు.. రాజ్యసభలో కార్యకలాపాల గురించి లోక్‌సభలో ప్రస్తావించవద్దని సభ్యులను స్పీకర్‌ ఓం బిర్లా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలో సమావేశమై చర్చించారు. సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన పార్టీల నేతలతో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సమావేశమయ్యారు.

రాజ్యసభలో చోటు చేసుకున్న పరిణామాలు, ప్రతిపక్షాల నిర్ణయం నేపథ్యంలో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉంది. అక్టోబర్‌ 1 వరకు కొనసాగాల్సిన సమావేశాలు 8 రోజుల ముందుగానే ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి.

Also Read: కరోనాతో వ్యక్తి మృతి.. మృతదేహాన్ని పీక్కుతిన్న ఎలుకలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.