యాప్నగరం

బీజేపీతో ఢీ.. రాష్ట్రపతి ఎన్నికలు పోటాపోటీగానే..!

కాంగ్రెస్, ఇతర పార్టీలు మాత్రం అభ్యర్థి విషయంలో ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చాయట

TNN 24 Apr 2017, 5:47 pm
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల తరపున అభ్యర్థి నిలవడం దాదాపుగా ఖాయం అవుతోంది. ఇప్పటి వరకూ రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఎవరిని నిలపాలనే అంశంపై భారతీయ జనతా పార్టీ ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా కనిపించడం లేదు కానీ.. కాంగ్రెస్, ఇతర పార్టీలు మాత్రం అభ్యర్థి విషయంలో ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చాయట. జేడీయూ నేత శరత్ యాదవ్, జేడీఎస్ నేత, మాజీ ప్రధాని దేవేగౌడల్లో ఎవరో ఒకరిని రాష్ట్రపతిగా అభ్యర్థిగా పోటీలో ఉంచాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయని సమాచారం.
Samayam Telugu opposition parties candidate on presidential polls
బీజేపీతో ఢీ.. రాష్ట్రపతి ఎన్నికలు పోటాపోటీగానే..!


ఎన్డీయే లోని పక్షాలన్నీ మద్దతును ఇచ్చినా.. భారతీయ జనతా పార్టీ ఆ బలంతో తను నిలబెట్టిన అభ్యర్థిని రాష్ట్రపతిగా గెలిపించుకోలేదు. దీనికి మిగతా పార్టీ సహకారం అవసరం ఉంటుంది. దాదాపు పాతిక వేల ఓట్ల అవసరం ఉంటుంది. అందుకోసం తమిళనాడులో అన్నాడీఎంకే, తెలంగాణలోని తెరాసను చేరదీయాలని బీజేపీ భావిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు కూడా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు కనిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, జేడీయూ, ఆర్జేడీ, ఎన్సీపీ, జేడీఎస్, బీఎస్పీ వంటి పార్టీలన్నీ కలిసి అభ్యర్థిని నిలపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ పార్టీలన్నీ ఏకంగా నిలిచినా తమ అభ్యర్థిని గెలిపించుకోవడం కష్టమే. మరిన్ని ప్రాంతీ పార్టీలు ప్రతిపక్షాలతో కలిసి వస్తే.. మాత్రం పోటీ రసవత్తరంగా మారుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.