యాప్నగరం

మత విద్వేశాలు రెచ్చగొడుతున్న మోదీ

‘‘రంజాన్ పండగ నాడు కరెంటు ఉంటే దివాళి పండగ రోజున కూడా విద్యుత్ ఉండాల్సిందే’’ అని

Samayam Telugu 20 Feb 2017, 11:32 am
‘‘రంజాన్ పండగ నాడు కరెంటు ఉంటే దివాళి పండగ రోజున కూడా విద్యుత్ ఉండాల్సిందే’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, సీపీఎంలు మండిపడ్డాయి. మోదీ మత విద్వేశాలు రెచ్చగొడుతూ ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.
Samayam Telugu opposition parties slam on modi for his comments on ramzan
మత విద్వేశాలు రెచ్చగొడుతున్న మోదీ


ఆదివారం ఉత్తర్ ప్రదేశ్ లోని ఫతేపూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ..‘రంజాన్ రోజు కరెండు ఉంటే దీపావళి రోజున కూడా ఉండాల్సిందే. కుల,మతాల కేటాయింపులు ఉండరాదు’’ అని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

మోదీ చేసి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ప్రధాని వ్యాఖ్యలు ప్రజల మధ్య విబేధాలు సృష్టించేలా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీకి చెందిన న్యాయవాది కేసీ మిట్టల్ తెలిపారు.

‘‘ఆయన (మోదీ) అలాంటి బాధ్యతారిహిత్యమైన, తప్పుడు స్టేట్ మెంట్లు ఇవ్వకూడదు. ఎన్నికల సంఘం మోదీపై చర్యలు తీసుకోవాలి. ఆయన ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లఘించారు’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ అన్నారు.

హిందూ, ముస్లింల మధ్య ప్రధాని విబేధాలు సృష్టిస్తున్నారని సీపీఎం నేత సీతారాం ఏచూరి ఆరోపించారు.

ఎన్నికల ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా వస్తాయనే నిరాశతోనే మోదీ ఈ విధమైన కామెంట్లు చేస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.