యాప్నగరం

తూత్తుకుడి ఘటనకు నిరసనగా తమిళనాడు బంద్

తమిళనాడులో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తూత్తుకుడిలో జరిగిన ఘటనలకు నిరసిస్తూ ప్రతిపక్షాలు ఈ బంద్‌కు పిలుపునివ్వడంతో.. ఉదయం నుంచే ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు.

Samayam Telugu 25 May 2018, 12:47 pm
తమిళనాడులో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తూత్తుకుడిలో జరిగిన ఘటనలకు నిరసిస్తూ ప్రతిపక్షాలు ఈ బంద్‌కు పిలుపునివ్వడంతో.. ఉదయం నుంచే ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. బంద్‌తో షాపులన్నీ స్వచ్ఛందంగా మూతపడగా.. బస్సులు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అక్కడక్కడా నిరసనకారులు బస్సుల్ని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముందస్తు జాగ్రత్తగా అక్కడక్కడా పోలీసు బలగాలను మోహరించారు. డీఎంకే, ఎండీఎంకే, వామపక్షాలతో పాటూ ప్రజా సంఘాలు కూడా ఈ నిరసనకు మద్దతు తెలపగా.. ప్రభుత్వం వెంటనే స్టెరిలైట్ ఫ్యాక్టరీని మూసేసి.. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు పార్టీల నేతలు.
Samayam Telugu TamilNadu


ఇటు తూత్తుకుడిలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్ధుమణుగుతున్నాయి. ఇవాళ బంద్‌కు పిలుపునివ్వడంతో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలగాలను భారీగా మోహరించారు. దీంతో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. పోలీసులు సెక్యూరిటీతో కొన్ని బస్సుల్ని నడిపించారు. తూత్తుకుడిలో స్టెరిలైట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నాలుగు రోజులుగా స్థానికులు ఆందోళన చేస్తుండగా.. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు-నిరసనకారుల మధ్య ఘర్షణ వాతావరణంతో.. రాళ్లదాడి, లాఠీఛార్జ్‌లు జరిగాయి. దీంతో హింస చెలరేగి 12మంది చనిపోయారు. దీన్ని నిరసిస్తూనే విపక్షాలు బంద్‌కు పిలుపునిచ్చాయి.

Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.