ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలని తాను బంధీలను చేయలేదని పేర్కొంటూ వారిని ఆదివారం సాయంత్రం మీడియా ముందుకు తీసుకువచ్చిన శశికళ.. ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడ ఓ కుటుంబంలా కలిసిమెలిసి వున్నారని అన్నారు. అమ్మ (దివంగత సీఎం జయలలిత) గుర్తుకొస్తే, ఇప్పటికీ దుఖం ఆగడం లేదు అంటూ ఎమ్మెల్యేలతో జరిగిన భేటీలో శశికళ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన పన్నీర్ సెల్వం... నీ మొసలి కన్నీళ్లు ఆపి ధైర్యం వుంటే ఎమ్మెల్యేలని తిరిగి అక్కడి నుంచి వారి వారి సొంత నియోజకవర్గాలకి పంపించు అంటూ శశికళకు సవాల్ విసిరారు.
రిసార్ట్స్లో ఒక్కో ఎమ్మెల్యే చుట్టూ నలుగురు గూండాలు కాపలా కాస్తున్నారని వాపోతూ ఇప్పటికీ శశికళ శిభిరంలో వున్న ఎమ్మెల్యేల్లో కొంతమంది తనకి ఫోన్ చేస్తున్నారని అన్నారు పన్నీర్ సెల్వం. "ఎమ్మెల్యేలు స్వేచ్ఛతోనే వున్నారు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పకపోతే, ధైర్యం వుంటే వారిని స్వేచ్ఛగా విడిచిపెట్టి, వాళ్ల వాళ్ల సొంత నియోజకవర్గాలకి పంపించొచ్చు కదా" అని ప్రశ్నించారు పన్నీర్ సెల్వం. పన్నీర్ సెల్వం విసిరిన ఈ సవాల్ని చిన్నమ్మ ఎలా స్వీకరిస్తారో, ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి!
రిసార్ట్స్లో ఒక్కో ఎమ్మెల్యే చుట్టూ నలుగురు గూండాలు కాపలా కాస్తున్నారని వాపోతూ ఇప్పటికీ శశికళ శిభిరంలో వున్న ఎమ్మెల్యేల్లో కొంతమంది తనకి ఫోన్ చేస్తున్నారని అన్నారు పన్నీర్ సెల్వం. "ఎమ్మెల్యేలు స్వేచ్ఛతోనే వున్నారు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పకపోతే, ధైర్యం వుంటే వారిని స్వేచ్ఛగా విడిచిపెట్టి, వాళ్ల వాళ్ల సొంత నియోజకవర్గాలకి పంపించొచ్చు కదా" అని ప్రశ్నించారు పన్నీర్ సెల్వం. పన్నీర్ సెల్వం విసిరిన ఈ సవాల్ని చిన్నమ్మ ఎలా స్వీకరిస్తారో, ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి!