యాప్నగరం

వాళ్లను గెంటేస్తేనే చర్చలు: పన్నీరు వర్గం

శశికళ కుటుంబ సభ్యును పార్టీ నుంచి గెంటేస్తేనే చర్చల ప్రక్రియ ముందుకు సాగుతుందని తమిళనాడు

TNN 20 Apr 2017, 5:28 pm
శశికళ కుటుంబ సభ్యును పార్టీ నుంచి గెంటేస్తేనే చర్చల ప్రక్రియ ముందుకు సాగుతుందని తమిళనాడు మాజీ సీఎం ఓ పన్నీరుసెల్వం శిబిరం అన్నాడీఎంకే (అమ్మ) వర్గానికి స్పష్టం చేసింది. ఇందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ లు ఎన్నికైనట్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ను ఉప సంహరించుకోవాలని సూచించింది.
Samayam Telugu ops camp says no talks without ouster of sasikala family
వాళ్లను గెంటేస్తేనే చర్చలు: పన్నీరు వర్గం


దీంతో పాటు జయలలిత మరణంపై పళనిసామి ప్రభుత్వం సీబీఐ విచారణ కోరుతూ కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఓపీఎస్ వర్గం షరతు విధించింది.

‘పార్టీ నుంచి శశికళ, దినకరన్ లను బహిష్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాలి. పార్టీ క్యాడర్ లో ఏ ఒక్కరూ ఆమె కుటుంబంతో ఏలాంటి సంబంధాలు పెట్టుకోరాదు’ అని ఓపీఎస్ టీంలోని నేత కేపీ మునుస్వామి స్పష్టం చేశారు.

జయలలిత మరణంపై అనుమానాలున్న రీత్యా సీబీఐ చేత దర్యాప్తు చేయించాలన్న డిమాండ్ లో ఏమాత్రం వెనుకడుగు వేసేది లేదని ఆయన తెలిపారు. ఈ షరతులకు అంగీకరిస్తే చర్చలకు సిద్ధమవుతామని ఆయన విస్పష్టంగా చెప్పారు.

పళనిసామి సీఎంగా కొనసాగుతారని, శశికళ ఆమె కుటుంబ సభ్యులను ఓపీఎస్ ఒత్తిడి మేరకు పార్టీ నుంచి బహిష్కరించడం లేదని లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై వెల్లడించిన నేపథ్యలో ఓపీఎస్ టీం గుర్రుగా ఉంది.

గురువారం ఓపీఎస్ ఎంపీ, ఎమ్మెల్యేలతో బిజీబిజీగా గడిపారు. ఆ తరువాత ఈ షరతులు విధించారు. ఓపీఎస్ షరతులపై అన్నాడీఎంకే (అమ్మ) నుంచి ఏలాంటి స్పందన రాలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.