యాప్నగరం

పన్నీరుకు పెరుగుతున్న మద్దతు

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళపై తిరుగుబాటు చేసిన తమిళనాడు అపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంకు

Samayam Telugu 9 Feb 2017, 12:42 pm
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళపై తిరుగుబాటు చేసిన తమిళనాడు అపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. పార్టీ ఎమ్మెల్యేగా...వివిధ వర్గాలు ఆయనకు బాసటగా నిలుస్తున్నాయి. అధికారాన్ని చేజిక్కించుకోవడంలోభాగంగా శశికళ పథకం ప్రకారమే రాష్ట్రవ్యాప్తంగా తన మద్దతుదారులను నిర్వాహకులుగా నియమించిందని సేలంలో జయ మేనకోడలు దీప మద్దతుదారులు ఆరోపించారు.
Samayam Telugu ops gets support from various quarters across tn
పన్నీరుకు పెరుగుతున్న మద్దతు


దీప మద్దతుదారుల్లో ఒకరైన మాజీ ఎమ్పీ అర్జునన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం దీపకు పిలుపునివ్వడం ఆహ్వానించదగిన పరిణామం అన్నారు. అన్నాడీఎంకే నుంచి శశికళను వెళ్లగొట్టేంత వరకు తమ పోరాటం ఆపబోమని చెప్పారు. పన్నీర్‌ సెల్వం మద్దతుదారులతో కలిసి పని చేస్తామన్నారు.

కాగా, గురువారం మధ్యాహ్నం చెన్నై రానున్న గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావును శశికళ కలువనున్నారు. తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేల జాబితాను ఆయనకు ఇచ్చి...తనతో ప్రమాణ స్వీకారం చేయించాలని కోరనున్నారు. ఉదయం జరిగిన సమావేశంలో 120మంది ఎమ్మెల్యేలు శశికళ శిబిరంలో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.