యాప్నగరం

ట్విస్ట్: ఓపీఎస్ వర్గంపై మండిపడ్డ ‘అమ్మ’టీమ్

తమతో విలీన చర్చలు జరగకుండా ఓపీఎస్ వర్గం ఏదో తిరకాసు పెడుతోందని అన్నాడీఎంకే (అమ్మ) నేతలు ఆరోపించారు

TNN 24 Apr 2017, 5:50 pm
తమతో విలీన చర్చలు జరగకుండా ఓపీఎస్ వర్గం ఏదో తిరకాసు పెడుతోందని అన్నాడీఎంకే (అమ్మ) నేతలు ఆరోపించారు. అన్నాడీఎంకే నుంచి శశికళ, దినకరన్ లను బహిష్కరించడంతో పాటు జయలలిత మరణంపై సీబీఐ చేత విచారణ జరిపించేలా హామీ ఇస్తేనే విలీన ప్రక్రియ ముందుకు సాగుతుందని ఓపీఎస్ శిబిరం అధికార అన్నాడీఎంకే (అమ్మ)కు షరతు విధించిన సంగతి తెలిసిందే.
Samayam Telugu ops team tries for stall talks alleges ruling aiadmk team
ట్విస్ట్: ఓపీఎస్ వర్గంపై మండిపడ్డ ‘అమ్మ’టీమ్


దీనిపై అధికార పార్టీ నేతలు మండిపడ్డారు. సోమవారం సీఎం పళనిసామి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశమై ఓపీఎస్ డిమాండ్లపై చర్చించారు. అనంతరం సమావేశం వివరాలు ఎంపీ వైత్తిలింగ్ మీడియాకు వివరించారు.

జయ మరణంపై ఇప్పటికే కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైందని అది విచారణకు వస్తే కమిషన్ గానీ, సీబీఐ విచారణకు గానీ తీర్పు వస్తుందని ఆయన తెలిపారు. ఇక పార్టీ నుంచి శశికళ, దినకరన్ లను తొలగించేందుకు తాము ఎన్నికల సంఘానికి ఇది వరకే ఫిర్యాదు చేశామని..దానిపై ఈసీ నిర్ణయం వెలువడాల్సి ఉందని చెప్పారు.

విలీన ప్రక్రియపై చర్చించేందుకు ముగ్గురు నేతలతో కూడి ప్యానెల్ ను ఓపీఎస్ టీం తిరస్కరిస్తోందని, ఏదో ఒక కారణంతో చర్చలు ముందుకు సాగనీయడం లేదని ఆయన ఆరోపించారు.

ఎలాంటి షరతులు లేకుండా ఓపీఎస్ వర్గంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని..పార్టీని బలోపేతం చేయడానికి ఎలాంటి చర్చలైనా చేస్తామని వైత్తిలింగం స్పష్టం చేశారు.

ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటానని దినకరన్ ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.

వైత్తిలింగం వ్యాఖ్యలపై ఓపీఎస్ టీం ఎలాంటి స్పందన తెలియజేయలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.