యాప్నగరం

వసుదైక కుటుంబం భారత్ సిద్ధాంతం.. ప్రపంచం మన అతిథి: మోహన్ భగవత్

అయోధ్యలో మందిర నిర్మాణం కోసం శతాబ్దాలుగా జరుగుతోన్న ఉద్యమం ఎట్టకేలకు ఫలించింది. దాదాపు 130ఏళ్లు న్యాయస్థానాల్లో కొనసాగిన వివాదం గతేడాది సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసింది.

Samayam Telugu 5 Aug 2020, 2:01 pm
అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలన్న హిందువుల శతాబ్దాల కల సాకారం కాబోతుంది. ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూమి పూజ అనంతరం జరిగిన సభలో మోహన్ భగవత్ మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణం కోసం ఎంతో మంది త్యాగం చేశారని, వారంతా ప్రస్తుతం భౌతికంగా ఇక్కడకు రాలేకపోయారన్నారు.
Samayam Telugu ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
Rammandir Bhoomi Puja


ఇక్కడకు రానివారు ఉన్నారని, వారిలో అద్వానీ జీ ఇంటిలోనే ఉండాల్సి వచ్చిందన్నారు. కొంతమంది రావాలి కానీ, కోవిడ్ -19 పరిస్థితి కారణంగా ఆహ్వానించలేదన్నారు.‘మన దేశం వసుదైక కుటుంబం భావనను నమ్ముతోంది.. ప్రపంచం మన అతిథి.. మన దేశవాసుల ఈ స్వభావం ప్రతి సమస్యకు పరిష్కారం కనుక్కోగలుగుతుంది.. ప్రతి ఒక్కరినీ వెంట తీసుకెళ్లాలని మేము నమ్ముతున్నాం. ఈ రోజు నూతన భారతావనికి కొత్త ప్రారంభం’ అని అన్నారు.

ఆలయ నిర్మాణం కలను సాకారం చేసుకోడానికి ఆర్ఎస్ఎస్ సహా అనేక హిందూ సంస్థలు 30 ఏళ్లు తీవ్రంగా కృషిచేశాయన్నారు. రామమందిరం గురించి 20-30ఏళ్లు పోరాటం చేయాల్సి ఉంటుందని అప్పుడే చెప్పానని భగవత్ అన్నారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆలయ శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.