యాప్నగరం

పానీపూరి తిని... 100 మంది ప్రాణం మీదకు తెచ్చుకున్నారు..!

పశ్చిమ బెంగాల్లో పానీపూరి తిన వందమందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. హుగ్లీ జిల్లాలో వీధిలోని ఓ బండి దగ్గర కొంతమంది పానీపూరి తిన్నారు. అలా తిన్న చాలామంది సాయంత్రానికి అస్వస్థతకు గురయ్యారు. వందమందికిపైగా వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు. వారంతా ఆస్పత్రిలో చేరారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 11 Aug 2022, 7:41 pm
పానీపూరి అంటే చాలామంది ఎగబడతారు. వీధుల్లో ఎక్కడబడితే అక్కడ దొరికే పానీపూరి తినడానికి అందరూ పడుతుంటారు. చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. అదే పానీపూరి వందమందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu Pani Puri


సుగంధ గ్రామ పంచాయతీ పరిధి డొగచియాలో ఓ వీధి బండి దగ్గర బుధవారం చాలామంది పానీపూరి తిన్నారు. అలా పానీపూరి తిన్నవారిలో చాలామంది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు.వందమందికిపైగా వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో ఇబ్బందిపడ్డారు. కొంతమంది పరిస్థితి మరింత విషమించడంతో ఆస్పత్రిలో చేరారు. ఈ విషయం గురించి తెలుసుకున్న వెంటనే స్థానిక ఆరోగ్య శాఖ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మందులు అందించారు. పానీపూరి తిని అస్వస్థతకు గురైన వారిలో డొగచియా, బహిర్‌ రనగచా, మకల్టాలా గ్రామాలకు చెందిన వారు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

గత మే నెలలో కూడా మధ్యప్రదేశ్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. మండలా జిల్లాలో జరిగిన ఓ జాతరలో పానీపూరి తిని 97 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. జిల్లా కేంద్రానికి 38 కిలోమీటర్లు దూరంలో ఉండే సింగర్‌పూర్‌లో జరిగిన జాతరకు చాలా గ్రామాల నుంచి పిల్లలు వెళ్లారు. అక్కడ ఒక దగ్గర పానీపూరి తిన్నారు. అయితే షాపులో పానీపూరి తిన్న కొంతసేపటికే పిల్లలు వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డారు. దాంతో వారిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స చేశారు. వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.