యాప్నగరం

గ్యాస్ లీకేజీ.. భారీ సంఖ్యలో విద్యార్థినులకు అస్వస్థత

గ్యాస్ లీకేజీ కారణంగా అస్వస్థతకు గురి కావడంతో దాదాపు 200 మంది పాఠశాల విద్యార్థినులను హాస్పిటల్‌కు..

TNN 6 May 2017, 1:11 pm
ఢిల్లీ: గ్యాస్ లీకేజీ కారణంగా అస్వస్థతకు గురి కావడంతో దాదాపు 200 మంది పాఠశాల విద్యార్థినులను హాస్పిటల్‌కు తరలించిన ఘటన దేశ రాజధాని నగరంలో చోటు చేసుకుంది. శనివారం ఉదయం తుగ్లకాబాద్‌లోని కంటైనర్ డిపో నుంచి గ్యాస్ లీకైంది. దీని ప్రభావంతో కళ్లు, గొంతు మండుతున్నట్లు స్టూడెంట్స్ చెప్పడంతో.. వెంటనే వారిని హాస్పిటల్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. తుగ్లకాబాద్ కంటైనర్ డిపోకు సమీపంలోనే ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే రాణి ఝాన్సీ గర్ల్స్ స్కూల్ ఉంది. ఉదయం 7:35 గంటల ప్రాంతంలో డిపో నుంచి కెమికల్ లీకైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
Samayam Telugu over 100 students admitted to hospital after gas leak in south delhi
గ్యాస్ లీకేజీ.. భారీ సంఖ్యలో విద్యార్థినులకు అస్వస్థత


వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అంబులెన్స్‌లలో విద్యార్థినులను దగ్గర్లోని మూడు ఆసుపత్రుల్లో చేర్చారు. వీరందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఇబ్బంది లేదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. కంటైనర్ డిపో నుంచి గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణ జరపాలని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, ఎస్డీఎంలను ఆదేశించినట్లు సిసోడియా మీడియాకు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.