యాప్నగరం

ఆ జిల్లాలు కరోనా ఫ్రీ.. ఒక్క రోజులోనే భారీగా కోలుకున్న బాధితులు: కేంద్రం

దేశంలో కరోనా కేసుల సంఖ్య 19 వేలకు చేరువలో ఉండగా.. మరణాల సంఖ్య 600 దాటింది. గడిచిన 24 గంటల్లో 1329 కరోనా బారిన పడగా.. 700 కోలుకున్నారని కేంద్రం తెలిపింది.

Samayam Telugu 21 Apr 2020, 7:15 pm
దేశంలో కరోనా కేసుల సంఖ్య 18,985కు చేరగా.. మరణాల సంఖ్య 603గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా ఒక్క రోజులోనే 700 మందికిపైగా కోవిడ్ నుంచి కోలుకున్నారని కేంద్రం ప్రకటించింది. మొత్తం 3260 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. ప్రస్తుతం దేశంలో 15,725 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 1329 మంది కరోనా బారిన పడ్డారని, 44 మంది చనిపోయారని ఆరోగ్య శాఖ తెలిపింది. గత 14 రోజులుగా 61 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాలేదని తెలిపింది. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
Samayam Telugu corona virus


భారత్‌లో ఇప్పటి వరకూ 4,49,810 కరోనా పరీక్షలు నిర్వహించగా.. సోమవారం ఒక్క రోజే 35,852 శాంపిళ్లను టెస్ట్ చేశామని ఐసీఎంఆర్ తెలిపింది. కరోనా కొత్త వ్యాధి అని తెలిపిన ఐసీఎంఆర్.. గత మూడున్నర నెలల్లో పీసీఆర్ టెస్టులను డెవలప్ చేశారని.. ఐదు వ్యాక్సిన్లు హ్యుమన్ ట్రయల్స్ ధశకు చేరుకున్నాయని తెలిపింది. ఏ వ్యాధి విషయంలోనూ ఇలా జరగలేదని స్పష్టం చేసింది. ర్యాపిడ్ టెస్టు కిట్లతో ఫలితాలు సరిగా రావడం లేదని ఫిర్యాదులు అందడంతో రెండు రోజులపాటు వీటితో పరీక్షలు నిర్వహించొద్దని ఐసీఎంఆర్ రాష్ట్రాలకు సూచించింది.

కేరళలో 19 కొత్త కేసులు నమోదు కాగా.. వీరిలో పది మంది విదేశాలకు వెళ్లొచ్చారని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తెలిపారు. కేరళలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 117గా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.