యాప్నగరం

అసోం అతలాకుతలం... మునిగిపోయిన గ్రామాలు.. నిరాశ్రయులైన 2 లక్షల మంది

అసోంలో అతి భారీ వర్షాలు పెను విషాదాన్ని మిగిలిస్తున్నాయి. వరద ప్రవాహంతో అసోంలో చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. ఇప్పటికే ఏడుగురు చనిపోగా, మరి కొంతమంది గల్లంతయ్యారు. లక్షలాది మంది తమ గూడును, నీడను కోల్పోయారు. వర్షాలు, వరదల కారణంగా 811 గ్రామాలు ప్రభావితమయ్యాయి. 1,277 ఇళ్లు పూర్తిగా, 5,262 పాక్షికంగా దెబ్బతిన్నాయి. అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నిరాశ్రయులైన వారికి ప్రభుత్వ భవనాల్లో ఆవాసం కల్పిస్తున్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 17 May 2022, 4:34 pm

ప్రధానాంశాలు:

  • పోటెత్తుతున్న వరద నీరు
  • ప్రభావితమైన 811 గ్రామాలు
  • ధ్వంసమైన రోడ్లు, రైల్వే ట్రాక్‌లు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu మునిగిన ఇళ్లు
వర్షాలు.. వరదలతో (Assam floods) అసోం అతలాకుతలమైంది. చాలాచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. రహదారులు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 2,02,385 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అధికారిక లెక్కల ప్రకారం ఏడుగురు చనిపోయారు. మరికొంతమంది గల్లంతయ్యారు. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ నివేదిక ప్రకారం వరదల కారణంగా చాలా జిల్లాలో మెట్రోలు దెబ్బతిన్నాయి. అలాగే మొత్తం 811 గ్రామాలు ప్రభావితమయ్యాయి. 1,277 ఇళ్లు పూర్తిగా, 5,262 పాక్షికంగా దెబ్బతిన్నాయి.
నాగోన్ జిల్లాలోని కంపూన్ ప్రాంతంలో వరద నీరు పోటెత్తడంతో చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో పాఠశాలలు, ఎత్తైన భూముల్లో తలదాచుకోవడంతో చాలా మంది ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. బ్రహ్మపుత్ర నదితో పాటు.. కంపూర్ ప్రాంతంలోని కోపిలి నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు.
చాలాచోట్ల వరదల కారణంగా వంతెనలు, రోడ్లు, రైల్వే ట్రాక్‌లు కూడా ధ్వంసమయ్యాయి.


నాగావ్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను అసోం జలవనరుల శాఖ మంత్రి పిజూష్ హజారికా సోమవారం సందర్శించారు. వరద పరిస్థితిని సమీక్షించారు. అలాగే పారామిలట్రీ బలగాలు, అగ్నిమాపక సిబ్బంది, ఎస్‌డీఆర్ఎఫ్, శిక్షణ పొందిన వాలంటీర్లు రంగంలోకి దిగి. బాధితులకు సహాయక చర్యలు చేస్తున్నారు. నిరాశ్రయులకు ప్రభుత్వ భవనాలు, పాఠశాలల్లో పునరాసం కల్పిస్తున్నారు. వర్షాల వల్ల డిటోక్‌చెర్రా స్టేషన్‌లో చిక్కుకుపోయిన సుమారు 16 వందల మంది రైల్వే ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.