యాప్నగరం

‘ఒవైసీని జిన్నా అనే భూతం పట్టిపీడిస్తోంది’

అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణానికి ముస్లింలు కట్టుబడి ఉన్నారని ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

TNN 26 Feb 2018, 11:21 am
అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణానికి ముస్లింలు కట్టుబడి ఉన్నారని ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ స్పందిస్తూ... భారతీయ ముస్లింలంతా రాముడి వారసులేనని అన్నారు. అంతేకాదు ఒవైసీని జిన్నా భూతం పట్టి పీడిస్తోందని, అందుకే దేశాన్ని ముక్కలు చేయాలనే ధోరణితో ఆయన అలా మాట్లాడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో బాబరు వారసులు గానీ, విదేశీయులు గానీ లేరని, భారతీయ ముస్లింలంతా రాముడివారసులేనని మంత్రి గిరిరాజ్ మరోసారి స్పష్టం చేశారు. హిందూ, ముస్లింల ఆరాధనల్లో తేడాలు ఉన్నప్పటికీ, గతంలో తామంతా ఒకటేనని, భారతీయులందరి పూర్వీకుడు రాముడేనని ఆయన వ్యాఖ్యానించారు.
Samayam Telugu owaisi influenced by ghost of jinnah wants to divide india union minister giriraj singh
‘ఒవైసీని జిన్నా అనే భూతం పట్టిపీడిస్తోంది’


అయోధ్య విషయంలో వాస్తవాల ఆధారంగానే సుప్రీం తీర్పు ఉంటుందన్న ఒవైసీ, ఆ ప్రాంతలోనే మసీదు నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. సుప్రీం తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని వ్యాఖ్యానించారు.‘దైవానుగ్రహంతో సుప్రీంకోర్టు తీర్పు మాకు అనుకూలంగా వస్తే అదే ప్రాంతంలో మసీదు నిర్మిస్తాం... ఎందుకంటే మా మసీదు అక్కడ ఉండేది. వాస్తవాల ఆధారంగానే కోర్టు తీర్పు ఉంటుంది తప్ప మత విశ్వాసాల ఆధారంగా కాదని’ఒవైసీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంతేకాదు అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో మసీదు నిర్మించాలన్న డిమాండ్‌ను ముస్లింలు వదిలిపెట్టబోరని ఒవైసీ పేర్కొన్నారు. ‘మాపై బెదిరింపులకు పాల్పడుతూ, ఆ స్థలాన్ని విడిచి వెళ్లాలని మాకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నవారికి చెబుతున్నది ఒక్కటే.. మేం మా మసీదును వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.