యాప్నగరం

పద్మ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ప్రణబ్

దేశంలో ప్రతిష్ఠాత్మక పురస్కారాలైన పద్మ అవార్డులను సోమవారం రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేశారు.

TNN 28 Mar 2016, 12:47 pm
దేశంలో ప్రతిష్ఠాత్మక పురస్కారాలైన పద్మ అవార్డులను సోమవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేశారు. ఐదుగురికి పద్మవిభూషణ , 8 మందికి పద్మ భూషణ్, 43 మందికి పద్మ శ్రీ అవార్డులు ప్రధానం చేశారు. ఈ ఏడాది 112 మది ప్రముఖులకు ప్రకటించిన పద్మ అవార్డుల్లో 56 మందికి మాత్రమే పురస్కారాలు ప్రధానం చేశారు. మిగిలిన 56 మందికి వచ్చే నెలలో అవార్డుల ప్రధానం చేస్తారని అధికారిక ప్రకటన విడుదలైంది. పద్మ అవార్డులు అందుకున్న ప్రముఖుల జాబితాను ఒక సారి పరిశీలిద్దాం..
Samayam Telugu padma awards
పద్మ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ప్రణబ్


పద్మవిభూషణ్: ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ అధినేత రవిశంకర్, దివంగత ధీరుభాయ్ అంబానీ, జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ జగ్ మోహన్, ప్రముఖ నృత్యకారణి యామినీ కృష్ణ మూర్తి, అవినాశ్ కమాలకర్ దీక్షిత్ లు రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదుగా పద్మవిభూణ్ అవార్డులు అందుకున్నారు

పద్మభూషణ్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా సెహ్వాల్,బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ , డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి , రసాయిన శాస్త్ర పరిశోధకులు ఆల్ల వెంకట రామారావు, మాజీ కాగ్ వినోద్ రాయ్ సహా 8 మందికి అవార్డుల ప్రధానం చేశారు

పద్మశ్రీ: ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ , నటుడు అజయ్ దేవ్ గణ్ ఆర్చర్ దీపికా కుమారి సహా 43 మందికి రాష్ట్రపతి ప్రణబ్ పద్మశ్రీ అవార్డులను ప్రధానం చేశారు

ఏప్రిల్ లో పురస్కారాలు అందుకోనున్న వారిలో టెన్నీస్ స్టార్ సానియా మీర్జా, సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ , ప్రముఖ నటి ప్రియాంక చోప్రా, ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు తదితరులు ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.