యాప్నగరం

సరిహద్దులో హెలికాప్టర్‌తో పాకిస్థాన్ కవ్వింపులు

వెన్నుపోట్లు పొడవడం అలవాటైన పాక్... మరోసారి బరితెగించింది. మొన్నటి వరకు ఆర్మీ టార్గెట్‌గా కాల్పులు జరిపింది. టెర్రిస్టుల్ని భారత్‌పైకి ఉసిగొల్పింది. ఇప్పుడు హెలికాప్టర్‌ను భారత భూ భాగంలోకి పంపి రెచ్చగొడుతోంది.

TNN 21 Feb 2018, 6:32 pm
పాకిస్థాన్ బోర్డర్‌లో మళ్లీ కవ్వింపులకు దిగుతోంది. ఇన్నాళ్లూ ఆర్మీ టార్గెట్‌గా కాల్పులకు దిగిన దాయాది దేశం... రూటు మార్చింది. సరిహద్దులో బరితెగించి హెలికాప్టర్‌తో భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు ప్రారంభించింది. పాక్ ఆర్మీ హెలికాప్టర్ ఏకంగా భారత భూభాగంలోకి వచ్చేసింది. పూంచ్ సెక్టార్‌లో 300 కిలోమీటర్ల లోపలికి వచ్చింది. ఈ విమానం Mi-17గా గుర్తించారు. చాపర్‌ను వెంటనే గుర్తించిన ఇండియన్ ఆర్మీ... అప్రమత్తమయ్యింది. హెచ్చరికలు జారీ చెయ్యడంతో పాక్ హెలికాప్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించి వీడియో కూడా బయటపడింది.
Samayam Telugu pak chopper violates airspace norms comes within 300m of loc
సరిహద్దులో హెలికాప్టర్‌తో పాకిస్థాన్ కవ్వింపులు


పాక్ హెలికాప్టర్ కనుక మన ఆర్మీ హెచ్చరికలతో వెనక్కు తిరిగి వెళ్లకుండా ఉంటే... అది కచ్చితంగా నేలకూలి ఉండేదంటున్నారు రక్షణరంగ నిపుణులు. ఈ ఘటనపై ఇండియన్ ఆర్మీ మండిపడుతోంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని పాక్ హై కమిషనర్‌కు నోటీసులు ఇవ్వాలనే డిమాండ్లు వినపడుతున్నాయి. మొన్నటి వరకు పాక్ బోర్డర్‌లో కాల్పులకు తెగబడింది. భారత బలగాలు అదే రేంజ్‌లో బదులిస్తుండటంతో... తోక ముడిచారు. అంతేకాదు చేసేదేమీ లేక టెర్రరిస్టుల్ని కూడా భారత్‌‌ సరిహద్దు వైపు ఉసిగొల్పింది. ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోవడంతో... ఇలా హెలికాప్టర్లతో కవ్విస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.