యాప్నగరం

ఈ కొత్త నోట్లకి నకిలీలు ముద్రించడం పాక్‌కి సాధ్యపడదు -ఐబీ

కొత్తగా ఇండియన్ మార్కెట్‌లోకి రానున్న రూ.500, 1000నోట్లకి నకిలీ నోట్లు సృష్టించడం పాకిస్తాన్‌కి అసాధ్యం అని నిఘావర్గాలు

TNN 10 Nov 2016, 6:31 am
కొత్తగా ఇండియన్ మార్కెట్‌లోకి రానున్న రూ.500, 1000 నోట్లకి నకిలీ నోట్లు సృష్టించడం పాకిస్తాన్‌కి అసాధ్యం అని నిఘావర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు పాకిస్థాన్ ఏడాదికి దాదాపు రూ.70 కోట్ల వరకు నకిలీ కరెన్సీని భారత్‌లోకి ప్రవేశపెడుతూ దేశ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీస్తోంది. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో కేవలం భారతీయ నకిలీ కరెన్సీని ముద్రించడం కోసమే ఓ ముద్రణాలయం వుందని... కానీ ఇకపై పాక్ ఆటలు సాగవు అని చెబుతున్నాయి నిఘావర్గాలు. గత ఆరు నెలలుగా గోప్యంగా జరుగుతున్న కొత్త కరెన్సీ ముద్రణని ఎంతో నిశితంగా పరిశీలించిన ఇంటెలీజెన్స్ బ్యూరో(ఐబీ), ఎక్స్‌టర్నల్ ఇంటెలీజెన్స్ ఏజెన్సీ(ఈఐఏ), రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా), డీఆర్ఐ బృందాలు... ఈ కరెన్సీని ఫోర్జరీ చేయడం అసాధ్యం అని పేర్కొన్నాయి. అయితే, అందులో అంత క్లిష్టతరమైన అంశాలు ఏమున్నాయి అనే విషయం మాత్రం భద్రతాపరమైన కారణాల రీత్యా అధికారులు బయటికి వెల్లడించలేదు.
Samayam Telugu pakistan cant forge our new rs 500 and 1000 denominations intelligence agencies
ఈ కొత్త నోట్లకి నకిలీలు ముద్రించడం పాక్‌కి సాధ్యపడదు -ఐబీ


పెషావర్‌లోని మింట్ కాంపౌండ్‌లో భారతీయ కరెన్సీని ముద్రించే మెషినరీ వ్యవస్థ వుందని... ఇండియన్ కరెన్సీని ముద్రించడంలో ఇసుమంతైనా తేడా రాకపోవడం ఇక్కడి ముద్రణ ప్రత్యేకత అని గతంలోనే ఇంటెలీజెన్స్ వర్గాలు భారత ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నివేదిక అందజేశాయి. దావూద్ ఇబ్రహీం, ఐఎస్ఐ, లష్కర్ ఏ తొయిబా వంటి సంఘ విద్రోహ శక్తుల సహాయంతో అక్కడ ముద్రించిన ఫేక్ కరెన్సీని పాక్‌లోని దుష్టశక్తులు భారత్‌లోకి ప్రవేశపెడుతున్నాయని ఇండియన్ ఇంటెలీజెన్స్ తమ నివేదికలో స్పష్టంచేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.