యాప్నగరం

పాక్ వక్రబుద్ధి.. మోదీ విమానానికి మరోసారి రెడ్‌సిగ్నల్

అంతర్జాతీయ బిజినెస్ ఫోరంలో పాల్గొనేందుకు మోదీ సోమవారం సౌదీ అరేబియా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సౌదీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు.

Samayam Telugu 27 Oct 2019, 8:37 pm
పొద్దున్న లేస్తే భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూ నీతులు వల్లించే పాకిస్థాన్ మరోసారి వక్రబుద్ది చాటుకుంది. సౌదీ అరేబియా పర్యటన కోసం మోదీ ప్రయాణించే విమానానికి తమ గగనతలంలో అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో భారత్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. జమ్మూకశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘటన జరుగుతున్న నేపథ్యంలో భారత ప్రధాని విమానానికి తమ గగనతలంలోకి అనుమతించబోమని పాక్ విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్ ఖురేషీ ప్రకటించారు.
Samayam Telugu plane


దీనిపై భారత హైకమిషనక్‌ లిఖితపూర్వకంగా సమాధానమిస్తామని ఆయన మీడియాకు వివరించారు. అంతర్జాతీయ బిజినెస్ ఫోరంలో పాల్గొనేందుకు మోదీ సోమవారం సౌదీ అరేబియా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సౌదీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు.

గత నెలలో మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన సందర్భంలోనూ పాక్ తమ గగనతలంలోకి విమానాన్ని అనుమతించలేదు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఐస్‌ల్యాండ్ పర్యటనలోనూ ఇదే రీతిలో వ్యవహరించింది. బాలాకోట్ దాడుల తర్వాత భారత విమానాలు తమ గగనతలంలో ప్రవేశించకుండా నిషేధం విధించి తర్వాత సడలించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మరోసారి అదే మాదిరి వక్రబుద్ధి చాటుకుంటోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.