యాప్నగరం

అయోధ్య వివాదంలో పాకిస్థాన్ హస్తం ఉంది!

అయోధ్య రామ జన్మభూమి, బాబ్రీ మసీద్ వివాదంలో పాకిస్థాన్ ప్రమేయం ఉందని షియా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

TNN 22 Nov 2017, 3:09 pm
అయోధ్య వివాదంలో పాకిస్థాన్ హస్తం ఉందని షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సయ్యద్ వసీం రిజ్వీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆరంభం నుంచే పాకిస్థాన్ నేరుగా ఈ వివాదంలో తలదూర్చిందని ఆయన తెలిపారు. సమస్య నేటికీ పరిష్కారం కాకపోవడానికి ఇది కూడా ఓ కారణమన్నారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీద్‌ను కూల్చివేశాక.. భారత్‌లో కంటే పాకిస్థాన్‌లోనే భారీగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పాక్‌లోని పలు దేవాలయాలపై దాడి చేశారు. దీన్ని బట్టి అయోధ్య వివాదంలో పాకిస్థాన్ పాత్ర ఉందని స్పష్టం అవుతోందన్నారు.
Samayam Telugu pakistan involved in ram janmabhoomi babri masjid dispute claims shia waqf board chairman wasim rizvi
అయోధ్య వివాదంలో పాకిస్థాన్ హస్తం ఉంది!


అయోధ్యలోని తాత్కాలిక రామ మందిరంపై 2005లో ఉగ్రవాదులు దాడి చేశారు. ఇది కూడా పాకిస్థాన్ ప్రమేయాన్ని సూచిస్తోందని వక్ఫ్ బోర్డ్ చైర్మన్ తెలిపారు. అయోధ్య భూవివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్న వారే పాక్ ఆదేశాలతో ఆటంకం కలిగిస్తున్నారని ఆయన గతంలోనూ ఆరోపించారు. మతం పేరిట భావోద్వేగాలను రెచ్చగొట్టి భారత్‌ను అస్థిర పరచడానికి పాక్ ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు.

అయోధ్య వివాదంలో పాక్ హస్తం ఉంది. ముస్లింల తరఫున సుప్రీం కోర్టులో ప్రాతినిధ్యం వహిస్తోన్న వారికి ఆ దేశంతో నేరుగా సంబంధాలు ఉన్నాయని రిజ్వీ ఆరోపించారు.

అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో రామ మందిరం నిర్మించాలని, లక్నోలో మసీదు నిర్మించాలని సూచిస్తూ.. షియా సెంట్రల్ బోర్డ్ ఓ ముసాయిదా తీర్మానాన్ని విడుదల చేసిన రెండు రోజుల తర్వాత రిజ్వీ పాక్ ప్రమేయం గురించి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ డ్రాఫ్ట్‌ను సుప్రీం కోర్టుకు సమర్పించారు. లక్నోలో మసీదు నిర్మాణానికి భూమి కేటాయించాలని కోరుతూ బోర్డు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.